మన వార్తలు , పటాన్ చెరు:
క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు, పటాన్ చెరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ అన్నారు. జార్ఖండ్ లో జరిగే జాతీయస్థాయి అండర్ 15 రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో సెలెక్ట్ అయిన చిన్నారి పూజకు గురువారం ఆయన పది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేశారని తెలిపారు క్రీడల్లో రాణించిన విద్యార్థులు మానసికంగా కూడా చాలా చురుకుగా ఉంటారని అన్నారు.
గతంలో క్రీడాకారులుగా ఎదిగిన వారందరూ కూడా సమాజంలో ఉన్నతమైన గౌరవం పొందుతున్నారని అన్నారు. అనేకమంది ఆ కోటాలో ఉద్యోగాలు సంపాదించి మంచి జీవితాన్ని గడుపుతున్నారని గుర్తుచేశారు. క్రీడాకారుల వల్ల ఆ గ్రామానికి, దేశానికి మంచి పేరు లభిస్తుందని అన్నారు. పూజ కూడా జాతీయస్థాయిలో మంచి క్రీడాకారిణిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నారుల ఎదుగుదలకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని స్పష్టం తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎట్టయ్య ముదిరాజ్, పైల్వాన్ చంద్రకాంత్ పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…