Districts

కలికట్టుగా మోడీని ఢీకొనచ్చు : శశిధరూర్

2024 ఎన్నికలపె గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో వ్యాఖ్య

పటాన్ చెరు టౌన్:

విపక్ష పార్టీల ఐక్యత అవశ్యమని , అవన్నీ ఒక గాటికి వచ్చి , ఉమ్మడి అవగాహనతో రానున్న రెండేళ్ళ కాలం కలిసికట్టుగా పోరాడితే ప్రస్తుతం పాలిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికలలో ఢీకొట్టవచ్చని లోక్సభ సభ్యుడు , రచయిత , పూర్వ విదేశాంగ శాఖ మంత్రి శశిధరూర్ చెప్పారు . ‘ గీతం ఛేంజ్ మేకర్స్ ‘ కార్యక్రమంలో భాగంగా శనివారం గీతం విద్యార్థులు , పలువురు అధ్యాపకులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు . ఎన్డీటీవీ పూర్వ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ – గీతం వ్యూహాత్మక కార్యక్రమాలు – విస్తరణ డెరైక్టర్ నిధి రజ్జాని సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ , మోడీ రెండుమార్లు 31 , 37 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చారని , ప్రతికూల ఓట్లే పెద్ద సంఖ్యలో ( 69 , 63 శాతం ) ఉన్నాయన్నారు . అంతేకాక ఆర్థిక వ్యవస్థ పతనం , నిరుద్యోగిత విపరీతంగా పెరగడం , కోవిడ్ -19 ని సరిగా ఎదుర్కోలేక ఆక్సిజన్ , ఆస్పత్రులలో పడకలు లేక అనేక మరణాలకు దారితీయడం , అంతిమ సంస్కారం కూడా చేయలేక పార్థివదేహాలను గంగపాలు చేయడం వంటి వెఫల్యాలు ఎన్నో ఉన్నాయని , రెత్తుల ఆందోళనపై అతిశయంతో వ్యవహరించారని , అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నరేగా , జనధన్ వంటి పలు సంక్షేమ పథకాలు అమలుచేసి చరిత్ర ఉండనే ఉందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు .

మమతాబెనర్జీ కలిసి రావడంపై ఆయన విశ్వాసం వ్యక్తపరుస్తూ , ఆమె తమతో అధిక కాలం కలిసి పనిచేసిందని , ఎన్నో అంశాలలో భావసారూప్యం ఉందని , అయితే గతంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరునే ఇటీవల ఎన్నికలలో కాంగ్రెస్ పట్ల ఆమె వ్యక్తపరిచినట్టు చెప్పారు . సోషల్ మీడియా ప్రజల ఆలోచనా తీరుపై ప్రభావం చూపుతోందని , అధికారంలో ఉన్నవారు దానిని కాపాడుకోవడం కోసం అనుకూల అంశాలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారని , దీనిపై ప్రజల ఆలోచనా తీరులో , మరీ ముఖ్యంగా ఉత్తర భారతీయుల ఆలోచనా తీరులో మార్పు రావాలని శశిధరూర్ అభిప్రాయపడ్డారు . దాదాపు 45 ట్రిలియన్ డాక్టర్ల భారతదేశ సంపదను 200 ఏళ్ళ ఆంగ్లేయ పాలనలో కొల్లగాట్టారని , అభివృద్ధి చెందిన జాబితాలో రెండో స్థానంలో ఉన్న మనం వెనుకబాటుకు లోనయ్యామన్నారు . 90 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని , 27 ఏళ్ళ సగటు జీవన ప్రమాణంగా ఉందని విచారం వెలిబుచ్చారు .

మనదేశంలోని కొన్ని ప్రాంతాలు బాగా వృ ద్ధి సాధించాయని , హార్డ్వేర్ , నౌకాశ్రయాలు , రైల్వే , రోడ్లు వంటి మౌలిక సదుపాయాలతో పాటు పారిశుధ్యం , ప్రజారోగ్యాలను కూడా వృద్ధి చేసుకోవాలని సూచించారు . ఓ సగటు భారతీయుడు అనారోగ్యం పాలెత్తే ఐదు కిలోమీటర్ల లోపు వెద్య సదుపాయం లేదని , 26-27 శాతం మంది మాత్రమే కళాశాల విద్యను అభ్యసించగలగుతున్నారని , విద్యను ప్రాథమిక హక్కుగా అమలు చేయడంతో పాటు ప్రతి భారతీయుడు మూడు పూటలా తిని , సొంత ఇంట్లో ఉంటూ , తమ పిల్లలకు మంచి చదువు , గౌరవ వేతనం కూడిన ఉపాధి వంటి అందితే మనం కూడా వృద్ధి చెందవచ్చని విశ్లేషించారు . తన బాల్యం , కుటుంబ నేపథ్యం , విద్య , దేశంలోని పలు ప్రాంతాలలో నివాసం , విద్యార్థి దశ , ఎమర్జెన్సీలో వ్యవహరించిన తీరు , కాంగ్రెస్ పార్టీలో చేరికతో పలు వివాదస్పద ట్వీట్ల వంటి వాటిని వివరించారు . ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ రాయడానికే అధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు .

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago