లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు…
-ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
పటాన్చెరు :
జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పోలీసులు ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ ను ఎస్పీ చంద్రశేఖ రెడ్డి పరిశీలించారు . డీఎస్పీ భీంరెడ్డి , సీఐ వేణు గోపాల్ రెడ్డి వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నామన్నారు . జిల్లాలో పరిశ్రమలు ఎక్కు వగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమలకు చెందిన వాహనాలు ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తున్నాయన్నారు . జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది రెండు షిప్టుల్లో విధులు నిర్వహి స్తున్నారని తెలిపారు . వాహన పాసులు అవసరమైన వారికి అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర సరిహద్దు జహీరాబాద్ , నారాయణఖేడ్ లలో మొత్తం నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు . ఈ కార్యక్రమంలో డీఎస్పీ భీం రెడ్డి , సీఐ వేణుగోపాల్ రెడ్డి , ఎస్సైలు ప్రసాద్ రావు , సాయిలు ట్రాఫిక్ ఎస్ఐలు రాములు ఆంజనేయులు దితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…