లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు…
-ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
పటాన్చెరు :
జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పోలీసులు ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ ను ఎస్పీ చంద్రశేఖ రెడ్డి పరిశీలించారు . డీఎస్పీ భీంరెడ్డి , సీఐ వేణు గోపాల్ రెడ్డి వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నామన్నారు . జిల్లాలో పరిశ్రమలు ఎక్కు వగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమలకు చెందిన వాహనాలు ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తున్నాయన్నారు . జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది రెండు షిప్టుల్లో విధులు నిర్వహి స్తున్నారని తెలిపారు . వాహన పాసులు అవసరమైన వారికి అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర సరిహద్దు జహీరాబాద్ , నారాయణఖేడ్ లలో మొత్తం నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు . ఈ కార్యక్రమంలో డీఎస్పీ భీం రెడ్డి , సీఐ వేణుగోపాల్ రెడ్డి , ఎస్సైలు ప్రసాద్ రావు , సాయిలు ట్రాఫిక్ ఎస్ఐలు రాములు ఆంజనేయులు దితరులు పాల్గొన్నారు
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…