లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు…
-ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
పటాన్చెరు :
జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పోలీసులు ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ ను ఎస్పీ చంద్రశేఖ రెడ్డి పరిశీలించారు . డీఎస్పీ భీంరెడ్డి , సీఐ వేణు గోపాల్ రెడ్డి వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నామన్నారు . జిల్లాలో పరిశ్రమలు ఎక్కు వగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమలకు చెందిన వాహనాలు ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తున్నాయన్నారు . జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది రెండు షిప్టుల్లో విధులు నిర్వహి స్తున్నారని తెలిపారు . వాహన పాసులు అవసరమైన వారికి అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర సరిహద్దు జహీరాబాద్ , నారాయణఖేడ్ లలో మొత్తం నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు . ఈ కార్యక్రమంలో డీఎస్పీ భీం రెడ్డి , సీఐ వేణుగోపాల్ రెడ్డి , ఎస్సైలు ప్రసాద్ రావు , సాయిలు ట్రాఫిక్ ఎస్ఐలు రాములు ఆంజనేయులు దితరులు పాల్గొన్నారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…