అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు…
– ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్
పటాన్ చెరు:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చిన మేరకే నిర్మాణాలు చేపట్టాలని ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్ బిల్డర్లకు సూచించారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి సుభాష్ అధ్యక్షతన బిల్డర్ల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సర్పంచ్ బండి హరీష్ శంకర్ మాట్లాడుతూ… పంచాయతీ అనుమతుల ప్రకారం జి ప్లస్-2 భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు, జి ప్లస్-2 మించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జి ప్లస్-2 ఆపై నిర్మించాలని కొనేవారు ఖచ్చితంగా హెచ్ఎండీఏ అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్నారు. అనుమతు లు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవనాలకు నోటీసులిచ్చి కూల్చివేస్తామని హెచ్చరించారు. కూల్చివేసిన వాటిని తిరిగి నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దుర్గారెడ్డి, రాజు, బిల్డర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…