కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్..
పటాన్ చెరు:
గ్రామ పంచాయతీ స్థాయిలో ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలో ఎవరికైనా జ్వరం, కరోనా లక్షణాలు ఉంటే ఉచిత పరీక్ష కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉపేందర్, ఎంపిడిఓ బన్సిలాల్, ఎం పీ ఓ రాజు, ఎంపీటీసీ కుమార్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ యాదవ్, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది గీత, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…