– ఓయూ ప్రొఫెసర్, లా సెట్ కన్వీనర్ విజయలక్ష్మి
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
నిరంతరం కృషి చేస్తేనే గొప్ప లాయర్ గా ఎదుగుతారని ఉస్మానియా విశ్వవిద్యాలయం డీన్ (ఫ్యాకల్టీ ఆఫ్ లా) ప్రొఫెసర్, లా సెట్ కన్వీనర్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం ముత్తంగి విశ్వభారతి లా కళాశాలలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె విచ్చేశారు. ముందుగా లా కళాశాల ప్రిన్సిపల్ భవాని, అధ్యాపకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఓయూ ప్రొఫెసర్, లా సెట్ కన్వీనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ… లా అనేది సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. విద్యార్థులకు రెగ్యులర్ గా కళాశాల వచ్చి అధ్యాపకుల బోధన వింటే సబ్జెక్టు లపై పట్టు పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు అటెండెన్స్, డిసిప్లేన్ ముఖ్యమని ఆమె తెలిపారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు చదవడం చాలా అవసరమని, రోజు రీడింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు లాయర్-అడ్వకేట్కు మధ్య తేడా ఏందో వివరించారు.అనంతరం ఆమె అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.అన్నిటిలో చురుగ్గా ఉంటే విజయం సాధిస్తారని చెప్పారు. జై భీమ్ సినిమా గురించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విశ్వభారతి లా కళాశాల ప్రిన్సిపల్ భవాని అధ్యాపకుల బృందం ముఖ్య అతిథిని సత్కరించి పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అంబర్, గురుమూర్తి, వర్ష, రమ్య, కీర్తి అన్వి, పూనం, లా మొదటి సంవత్సరం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…