Telangana

నిరంతరం కృషి చేస్తేనే గొప్ప లాయర్ గా ఎదుగుతారు

– ఓయూ ప్రొఫెసర్, లా సెట్ కన్వీనర్ విజయలక్ష్మి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

నిరంతరం కృషి చేస్తేనే గొప్ప లాయర్ గా ఎదుగుతారని ఉస్మానియా విశ్వవిద్యాలయం డీన్ (ఫ్యాకల్టీ ఆఫ్ లా) ప్రొఫెసర్, లా సెట్ కన్వీనర్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం పటాన్‌చెరు మండలం ముత్తంగి విశ్వభారతి లా కళాశాలలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె విచ్చేశారు. ముందుగా లా కళాశాల ప్రిన్సిపల్ భవాని, అధ్యాపకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఓయూ ప్రొఫెసర్, లా సెట్ కన్వీనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ… లా అనేది సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. విద్యార్థులకు రెగ్యులర్ గా కళాశాల వచ్చి అధ్యాపకుల బోధన వింటే సబ్జెక్టు లపై పట్టు పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు అటెండెన్స్, డిసిప్లేన్ ముఖ్యమని ఆమె తెలిపారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు చదవడం చాలా అవసరమని, రోజు రీడింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు లాయర్-అడ్వకేట్కు మధ్య తేడా ఏందో వివరించారు.అనంతరం ఆమె అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.అన్నిటిలో చురుగ్గా ఉంటే విజయం సాధిస్తారని చెప్పారు. జై భీమ్ సినిమా గురించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విశ్వభారతి లా కళాశాల ప్రిన్సిపల్ భవాని అధ్యాపకుల బృందం ముఖ్య అతిథిని సత్కరించి పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అంబర్, గురుమూర్తి, వర్ష, రమ్య, కీర్తి అన్వి, పూనం, లా మొదటి సంవత్సరం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

19 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

1 day ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

1 day ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

1 day ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

1 day ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago