Telangana

హార్మోన్ల అసమతుల్యతే అనారోగ్యానికి కారణం: డాక్టర్ ప్రదీప్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీవోఎస్) ద్వారా ప్రభావితమైమెన వారిలో హార్మోన్ అసమతుల్యత కారణంగా పురుష హార్మోన్లు సాధారణం కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని, దీని కారణంగా ఋతుక్రమం తప్పడం, బరువు పెరగడం, అధిక జుట్టు పెరుగుల, మొటిమలు, అండాశయ తిత్తులు, చర్మ సమస్మలకు దారితీస్తున్నట్టు సీనియర్ కల్సల్టెంట్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి దువ్వూరు, ఎండీ (ఇంటర్నల్ మెడిసిన్) వెల్లడించారు.’జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని బుధవారం ‘బియాండ్ ద ఎక్రోనిమ్స్: పీసీవోడీ-పీసీనోఎస్’ అనే అంశంపై ఆతిథ్య ఉపన్యాసం చేశారు. మహిళల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, సిండ్రోమ్ల వ్యాప్తి, వాటి ప్రభావం గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.పీసీవోఎస్ ప్రారంభంలోనే రోగ నిర్ధారణ, నిర్వహణల ప్రాముఖ్యతను డాక్టర్ దువ్వూరు నొక్కిచెబుతూ, ఇది సంతానోత్పత్తి, శారీరక ఆరోగ్యం, గుండె ఆరోగ్యాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఆరోగ్యకరమెనై ఆహారం, శారీరక వ్యాయామం, తగిన ఔషధాలు తీసుకోవడంతో పాటు ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ సమస్యను తోటి స్నేహితుల, కుటుంబ సభ్యులు, లేదా వెద్యనిపుణులతో పంచుకుని, దానికి వీలయినంత త్వరగా తగ్గించుకునేందుకు ప్రయత్నించడం మంచిదని హితవు పలికారు.అనుభవజ్ఞుడి నుంచి మహిళారోగ్య సమాచారాన్ని తెలుసుకోవడానికి, అవగాహన పొందడానికి నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన తగిన జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. చివరగా, విద్యార్థులు వెద్య నిపుణుడికి జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago