Telangana

చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే _పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

_అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి..

_కలవడం కలవడమే కొట్లాట కొట్లాటే 

_దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు..

_కేసిఆర్ ఆశీర్వాదంతోనే మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాం..

_పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ వెంటే నడుస్తామనికేసిఆర్ ఆశీర్వాదంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించామని.. నమ్ముకున్న ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లైనా కలుస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బుధవారం హైదరాబాదులోని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సహచర శాసనసభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు.బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో..మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గ ప్రజల నమ్మకంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగిందని తెలిపారు.ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం కల్పిద్దామని అధికారం కట్టబెట్టారని ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో మంజూరైన జీవోల అమలు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందే తప్ప.. ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆయన విస్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లైనా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావు లేదని తెలిపారు.సమస్యలు పరిష్కారం కానీ పక్షంలో పోరాటాలకు సైతం సిద్ధమని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులను కలిశారని అదే విధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము ముఖ్యమంత్రి కలిశామని ఈ అంశంపై రాజకీయ దుష్ప్రచారం చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు.రాజకీయ వైరుధ్యాలు ఉంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని కలవడం తప్పా అని ప్రశ్నించారు.కాకమ్మ కబుర్లు చెబుతూ అధికార కాంగ్రెస్ పార్టీ కాలం వెళ్లదీస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కెసిఆర్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని తెలిపారు.సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago