Telangana

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

  • ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి
  • ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతి ఓటు ప్రాణాధారమని, ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే అర్హులైన ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని, ఆగస్టు 3వ తేదీ లోపు తమ దరఖాస్తులను పూర్తి వివరాలతో సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.గురువారం పటాన్‌చెరు డివిజన్‌లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌ఐఆర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 30 ప్రచార రథాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతోనే ఒక ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, ఆ భాగస్వామ్యానికి తొలి మెట్టు ఓటు హక్కేనని స్పష్టం చేశారు.పటాన్‌చెరులో శాశ్వతంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో పాల్గొనని వారు తమ విలువైన ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి, పటాన్‌చెరు అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావాలంటే ప్రతి ఓటరు బాధ్యతగా ఎస్‌ఐఆర్‌లో పాల్గొనాలని కోరారు.నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది డివిజన్లు, మూడు మున్సిపాలిటీలు, రెండు మండలాల్లోని ప్రతి వార్డు వరకు ఈ ప్రచార రథాలు చేరుకుని ప్రజలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. అలాగే ప్రార్థనా స్థలాలు, క్రీడా ప్రాంగణాలు, విద్యా సంస్థలు, పార్కులు, మార్కెట్లు, పారిశ్రామిక ప్రాంతాలు తదితర ప్రజా ప్రదేశాల్లో వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఎస్‌ఐఆర్ ప్రాముఖ్యతను విస్తృతంగా తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

12 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

13 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

13 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

13 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

2 days ago