Telangana

వ్యాపార నిర్ణయంలో ఏఐ&ఎంఎల్ వినియోగంపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ‘వ్యాపార నిర్ణయం తీసుకోవడం కోసం కృత్రిమ మేధస్సు & యంత్ర అభ్యాసం’పై మే నెల 25 నుంచి 29వ తేదీ వరకు, ఐదు రోజుల ఆన్ లైన్ ఆచారణాత్మక కార్యశాల (యాజమాన్య వికాస కార్యక్రమం – ఎండీపీ)ను నిర్వహిస్తున్నట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఆధునిక వ్యాపార నిర్ణయం తీసుకోవడంలో కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) యొక్క పెరుగుతున్న ప్రాధాన్యాన్ని సదస్యులకు పరిచయం చేయడం ఈ కార్యక్రమ లక్షమని తెలిపారు. ఏఐ-ఆధారిత విశ్లేషణలు వినియోగదారులను ఆకట్టుకోవడం, డిమాండ్ అంచనా, నష్ట అంచనా, ఆయా సంస్థలకు అనుగుణంగా మార్కెటింగ్ వంటి రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్నందున, డేటా-ఆధారిత నిర్ణయాల కోసం ఈ సాంకేతికతలను వినియోగించడానికి ఆచరణాత్మక అంతర్దృష్టులతో ఈ శిక్షణలో పాల్గొనేవారిని సన్నద్ధం చేయడానికి ప్రయత్నిస్తామని వివరించారు.

ప్రధానంగా నిర్వహణ, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, కంప్యూటర్ అప్లికేషన్లు, ఇంజనీరింగ్ విభాగాల నుంచి అధ్యాపకుల కోసం రూపొందించినట్టు తెలియజేశారు. ఎంఎల్ ను పూర్తిగా సాంకేతిక అంశంగా పరిగణించడం కంటే వ్యాపార-ఆధారిత వినియోగ కేసులు, ఆచరణాత్మక ప్రదర్శనలు, నమూనా ఉత్పత్తి వివరణపై కార్యశాల దృష్టి పెడుతుందన్నారు. ఇందులో పాల్గొనేవారికి ఏఐ, ఎంఎల్ భావనలను అందుబాటులో ఉంచడానికి ఆచరణాత్మక డేటాసెట్లు, విజువలైజేషన్ ఆధారిత వివరణలు, ఉపయోగించడానికి సులభమైన విశ్లేషణ అంతర్ముఖంగా ఉపయోగిస్తామని తెలిపారు.బిజినెస్ అనలిటిక్స్, డేటాసైన్స్, ఏఐ-ఎంఎల్ అప్లికేషన్లలో విస్తృత అనుభవం ఉన్న విద్యావేత్త, పరిశోధకుడు డాక్టర్ ఎం.కామాక్షయ్య ప్రధాన శిక్షకుడిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం పర్యవేక్షించిన, పర్యవేక్షించని అభ్యాసం, సిఫారసుదారు వ్యవస్థలు, సమిష్టి నమూనాలు వంటి కీలక అంశాలను వివరిస్తుందని తెలిపారు. ప్రతి సాంకేతికతను వినియోగదారుల అంచనా, మార్కెట్ విభజన, ఉత్పత్తి సిఫార్సు, మోసం గుర్తింపుతో సహా వాస్తవ-ప్రపంచ నిర్వాహక ప్రశ్నలను అనుసంధానిస్తుందని వివరించారు.

ఈ కార్యశాల పూర్తయ్యేసరికి, ఇందులో పాల్గొనేవారు విషయ పరిజ్జానంపై అవగాహనతో పాటు ఏఐ-ఎంఎల్ పద్ధతులను ఆచరణాత్మకంగా తెలుసుకుంటారని తెలిపారు. ఈ పద్ధతులను వ్యాపార నిర్ణయ సమస్యలకు వర్తింపజేయడానికి, ఏఐ-ఆధారిత అధ్యయనాలు (కేస్ స్టడీస్), విద్యార్థి ప్రాజెక్టులను రూపొందించడానికి వీలు కల్పిస్తుందన్నారు.ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు, తమ పేర్ల నమోదు, రుసుము, ఇతరత్రా వివరాల కోసం jpaul@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని లేదా డాక్టర్ జోసెఫ్ పాల్ ను సంప్రదించాలని సూచించారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

2 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

2 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

8 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

20 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

20 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

20 hours ago