Telangana

వ్యాపార నిర్ణయంలో ఏఐ&ఎంఎల్ వినియోగంపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ‘వ్యాపార నిర్ణయం తీసుకోవడం కోసం కృత్రిమ మేధస్సు & యంత్ర అభ్యాసం’పై మే నెల 25 నుంచి 29వ తేదీ వరకు, ఐదు రోజుల ఆన్ లైన్ ఆచారణాత్మక కార్యశాల (యాజమాన్య వికాస కార్యక్రమం – ఎండీపీ)ను నిర్వహిస్తున్నట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఆధునిక వ్యాపార నిర్ణయం తీసుకోవడంలో కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) యొక్క పెరుగుతున్న ప్రాధాన్యాన్ని సదస్యులకు పరిచయం చేయడం ఈ కార్యక్రమ లక్షమని తెలిపారు. ఏఐ-ఆధారిత విశ్లేషణలు వినియోగదారులను ఆకట్టుకోవడం, డిమాండ్ అంచనా, నష్ట అంచనా, ఆయా సంస్థలకు అనుగుణంగా మార్కెటింగ్ వంటి రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్నందున, డేటా-ఆధారిత నిర్ణయాల కోసం ఈ సాంకేతికతలను వినియోగించడానికి ఆచరణాత్మక అంతర్దృష్టులతో ఈ శిక్షణలో పాల్గొనేవారిని సన్నద్ధం చేయడానికి ప్రయత్నిస్తామని వివరించారు.

ప్రధానంగా నిర్వహణ, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, కంప్యూటర్ అప్లికేషన్లు, ఇంజనీరింగ్ విభాగాల నుంచి అధ్యాపకుల కోసం రూపొందించినట్టు తెలియజేశారు. ఎంఎల్ ను పూర్తిగా సాంకేతిక అంశంగా పరిగణించడం కంటే వ్యాపార-ఆధారిత వినియోగ కేసులు, ఆచరణాత్మక ప్రదర్శనలు, నమూనా ఉత్పత్తి వివరణపై కార్యశాల దృష్టి పెడుతుందన్నారు. ఇందులో పాల్గొనేవారికి ఏఐ, ఎంఎల్ భావనలను అందుబాటులో ఉంచడానికి ఆచరణాత్మక డేటాసెట్లు, విజువలైజేషన్ ఆధారిత వివరణలు, ఉపయోగించడానికి సులభమైన విశ్లేషణ అంతర్ముఖంగా ఉపయోగిస్తామని తెలిపారు.బిజినెస్ అనలిటిక్స్, డేటాసైన్స్, ఏఐ-ఎంఎల్ అప్లికేషన్లలో విస్తృత అనుభవం ఉన్న విద్యావేత్త, పరిశోధకుడు డాక్టర్ ఎం.కామాక్షయ్య ప్రధాన శిక్షకుడిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం పర్యవేక్షించిన, పర్యవేక్షించని అభ్యాసం, సిఫారసుదారు వ్యవస్థలు, సమిష్టి నమూనాలు వంటి కీలక అంశాలను వివరిస్తుందని తెలిపారు. ప్రతి సాంకేతికతను వినియోగదారుల అంచనా, మార్కెట్ విభజన, ఉత్పత్తి సిఫార్సు, మోసం గుర్తింపుతో సహా వాస్తవ-ప్రపంచ నిర్వాహక ప్రశ్నలను అనుసంధానిస్తుందని వివరించారు.

ఈ కార్యశాల పూర్తయ్యేసరికి, ఇందులో పాల్గొనేవారు విషయ పరిజ్జానంపై అవగాహనతో పాటు ఏఐ-ఎంఎల్ పద్ధతులను ఆచరణాత్మకంగా తెలుసుకుంటారని తెలిపారు. ఈ పద్ధతులను వ్యాపార నిర్ణయ సమస్యలకు వర్తింపజేయడానికి, ఏఐ-ఆధారిత అధ్యయనాలు (కేస్ స్టడీస్), విద్యార్థి ప్రాజెక్టులను రూపొందించడానికి వీలు కల్పిస్తుందన్నారు.ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు, తమ పేర్ల నమోదు, రుసుము, ఇతరత్రా వివరాల కోసం jpaul@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని లేదా డాక్టర్ జోసెఫ్ పాల్ ను సంప్రదించాలని సూచించారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

18 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

19 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

19 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

23 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

23 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

23 hours ago