Telangana

క్రీడలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం డిప్యూటీ లేబర్ కమిషనర్ (డిసిఎల్) రవీందర్ రెడ్డి

ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే వర్ధిల్లాలి

శ్రమ సంస్కృతిని గౌరవిద్దాం

సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

క్రికెట్ టోర్నమెంట్ విజేతలు తోషిబా టీం,రన్నర్ సినర్జీ టీం

మేడే సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

కార్మికులు రోజువారి విధుల్లో మునిగిపోయి ఒత్తిడికి లోనవుతుంటారని అప్పుడప్పుడు ఆటలు ఆడడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డిప్యూటీ లేబర్ కమిషనర్ (డిసిఎల్) రవీందర్ రెడ్డి అన్నారు.మేడే శ్రామికోత్సవాల సందర్భంగా పాశమైలారం పారిశ్రామిక వాడలోని మార్కెట్ మైదానం లో జరుగుతున్న “మేడే క్రికెట్ టోర్నమెంట్” ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డిప్యూటీ లేబర్ కమిషనర్ డిసిఎల్ రవీందర్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల రోజువారి విధుల్లో మునిగిపోయి ఒత్తిడికి లోనవుతుంటారు అప్పుడప్పుడు ఆటలు ఆడడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమన్నారు. మేడే క్రీడోత్సవాలు నిర్వహిస్తున్న సిఐటియు కార్మిక సంఘమును ఈ సందర్భంగా అభినందించారు.సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే కార్మికులకు 8గంటల పని హక్కులు కోసం పోరాడిన రోజు అని అన్నారు.

శ్రామికుల శ్రమనే సంపదకు మూలం అని దేశ నిర్మాణంలో శ్రామికుల శ్రమ కీలకపాత్ర పోషిస్తుందని శ్రమ సంస్కృతిని గౌరవిద్దామన్నారు. కార్మికుల హక్కులు భద్రత సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం సిఐటియు అన్నారు. మేడే సందర్భంగా శ్రామికోత్సవాలు నిర్వహిస్తూ కార్మికులకు కార్మికుల పిల్లలకు క్రికెట్ టోర్నమెంట్ వ్యాసరచన పాటల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. శ్రామిక శక్తి మేడే ను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు.నిర్వాణ కమిటీ కన్వీనర్ కిర్బి జనరల్ సెక్రెటరీ విఎస్ రాజు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘం సిఐటియు అన్నారు పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ లో మేడే సందర్భంగా నిర్వహిస్తున్న శ్రామికోత్సవాలకు కార్మికులు సహకరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్వాణ కమిటీ సభ్యులు శ్రీనివాస్, లక్ష్మణ్, శ్యామ్ శ్యాంసుందర్, మహేశ్వర్ రెడ్డి, రాజిరెడ్డి, సోమన్న, జైపాల్, సుధాకర్, గోపాల్, భూమేష్, ప్రశాంత్, వెంకటేష్, పెద్దిరాజు, సంతోష్ గౌడ్, శేఖర్ రెడ్డి, మదన్ రెడ్డి, దామోదర్, రోషన్ తోషిబా జనసేన సెక్రెటరీ అనంతరావు, శ్రీధర్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ కు బుద్ది చెప్పుతాం బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి

మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : మహిళా రిజర్వేషన్ బిల్లు ను మోదీ ప్రభుత్వం తీసుకోవస్తే కాంగ్రెస్ అడ్డుకొని మహిళా…

42 minutes ago

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , మియాపూర్ : సేవాదళ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, క్రమశిక్షణ, సేవా భావం శేరిలింగంపల్లి…

3 hours ago

వ్యాపార నిర్ణయంలో ఏఐ&ఎంఎల్ వినియోగంపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ‘వ్యాపార నిర్ణయం తీసుకోవడం కోసం కృత్రిమ…

3 hours ago

ప్రజలు కాంగ్రెస్ ను నమ్మేపరిస్థితి లేదు బీఆర్‌ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి

  మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్‌ఎస్ పార్టీ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని పటాన్‌చెరు…

22 hours ago

సివిల్ ఇంజనీరింగ్ లో ఆకుల విశాల్ కు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

23 hours ago

మే 10 న పటాన్‌చెరులో 10వ జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు

ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మే 10వ తేదీన పటాన్‌చెరు పీవీ…

23 hours ago