మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం:
పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీ పురం 268 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్, ఆర్ఆర్కే ఫౌండేషన్ చైర్మన్, ఆర్ఆర్కే ఎంటర్ప్రైజెస్ చైర్మన్ ఆర్కే లక్ష్మి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వారి బాధలు వినేందుకు బస్తీల్లో 110 వ రోజు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు . అనంతరం ఆర్ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్కే లక్ష్మి మాట్లాడుతూ కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లు, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంది. ఆర్ఆర్కే ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం కూడా ఆర్కే లక్ష్మి అందిస్తున్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…
మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు : గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…
పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…
_చేనేతకారులకు మరింత చేయూతనివ్వాలి మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కళింగ కల్చరల్ సెంటర్…