Telangana

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , మియాపూర్ :

సేవాదళ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, క్రమశిక్షణ, సేవా భావం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సేవాదళ్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు నిర్వహిస్తున్న “సమర్థ-శిక్షణ శిబిరం”లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ ,యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.అనంతరం శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ సేవాదళ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, క్రమశిక్షణ, సేవా భావం, త్యాగం అనే విలువలపై నిలిచిన శక్తివంతమైన వేదిక అని పేర్కొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల హక్కుల కోసం పోరాడుతూ, స్వాతంత్ర్య సమరం నుండి సామాజిక న్యాయం వరకు కీలక పాత్ర పోషించిందని తెలిపారు.“కాంగ్రెస్ అంటే సేవ సేవ అంటే ప్రజల గెలుపు. ప్రజల పక్షాన పోరాటమే సేవాదళ్ ధర్మం” అని ఆయన పేర్కొన్నారు.

యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని బలపరచడం, ప్రతి కార్యకర్తను సేవా దిశగా తీర్చిదిద్దడం ఈ శిక్షణ శిబిరం ప్రధాన ఉద్దేశమని వివరించారు.ఈ శిబిరం ద్వారా సేవాదళ్ కార్యకర్తలు నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యలపై అవగాహన, క్రమశిక్షణ, ఐక్యత వంటి విలువలను అలవరుచుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు నాయకులను తీర్చిదిద్దే వేదికగా ఈ శిక్షణ శిబిరం నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి , శ్రీ సౌందర్య రాజన్ , ప్రణీత్,రత్నాచారి,సేవాదళ్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిద్దెల జితేందర్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు మరియు మియాపూర్ యువనాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

18 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

19 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

19 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

23 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

24 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

24 hours ago