Andhra Pradesh

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు : 

గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య డైనో మండి రెస్టారెంట్ ప్రారంభం అయింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అందాల తార భాగ్యశ్రీ బోర్సె చేతుల మీదుగా నాలుగవ బ్రాంచ్ గా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్ గుంటూరులో ఘనంగా ప్రారంభం అయింది. పిల్లలను, పెద్దలను ఆకర్షించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రెస్టారెంట్ అందరిని ఆకర్షిస్తుంది.

ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ మాట్లాడుతూ గుంటూరు ప్రజలందరికి హియ్య డైనో మండి గురించి ముందే తెలుసు, హైదరాబాద్ లో చాలా పాపులర్ అని అన్నారు. ఇక్కడ ఫుడ్ చాలా రుచిగా ఉందన్నారు. అందరూ తప్పకుండా వచ్చి ఒక్కసారి ఆ రుచిని చవిచూడాలని పేర్కొన్నారు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ వస్తారు, కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ వాతావరణాన్ని బాగా ఇష్టపడతారని పేర్కొన్నారు. ఒక ఫ్యామిలీ ఆహ్లాదారకరమైన వాతావరణంలో ప్రశాంతంగా భోజనం చేసేలా ఉందని తెలిపారు. ముఖ్యంగా తన అభిమానులకు హియ్య డైనో మండికి స్వాగతం పలికారు.

గౌతమి చౌదరి మాట్లాడుతూ ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. గుంటూరులో ప్రారంభించిన హియ్య డైనో మండి రెస్టారెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఏషియాలోనే ఫస్ట్ థియేట్రికల్ రెస్టారెంట్ హియా డైనో మండి అని వెల్లడించారు. తక్కువ డబ్బులతో మంచి వాతావరణంలో.. రుచికరమైన భోజనం తినాలి అంటే సరియైన ప్లేస్ లేదని అనిపించి గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను స్థాపించామని తెలిపారు. ఇకపై కుటుంబ సమేతంగా గుంటూరు ప్రజలు వస్తారని, తెలంగాణ, ఆంధ్ర ఏ ప్రాంతం వారైనా గుంటూరుకు వచ్చారంటే హియమండిని సందర్శించండి అని తెలిపారు.

గుంటూరు ఫ్రాంచైస్ ఓనర్ మాట్లాడుతూ గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ఓపెనింగ్ కు వచ్చిన హీరోయిన్ భాగ్యశ్రీ, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. నాలుగు నెలలుగా ఈ రెస్టారెంట్ డిజైనింగ్ కోసం ఎంతో కష్టపడ్డామని తెలిపారు. కానీ ఫైనల్ గా అన్ని విధాల రెస్టారెంట్ అదిరిపోయిందని, ఇక ఫుడ్ విషయంలో టాప్ క్వాలిటీ గా ఉందని తెలిపారు. గుంటూరు ప్రజలు మాత్రమే కాదు గుంటూరుకు వచ్చిన అందరూ హియ్య డైనో మండి రెస్టారెంట్ ఒక్కసారి ట్రై చేస్తే ఎప్పటికీ మర్చిపోరని ఆశాభావం వ్యక్తం చేశారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

14 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

15 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

15 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

19 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

19 hours ago

చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన సినీ నిర్మాత ప్రీతి పులిపాక

_చేనేతకారులకు మరింత చేయూతనివ్వాలి మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కళింగ కల్చరల్ సెంటర్…

19 hours ago