మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి :
మహిళా రిజర్వేషన్ బిల్లు ను మోదీ ప్రభుత్వం తీసుకోవస్తే కాంగ్రెస్ అడ్డుకొని మహిళా ద్రోహిగా మరిందని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో మహిళా ఆగ్రహ యాత్ర , కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఉమారాణి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూమహిళలు, దళితులు, గిరిజనులు చట్టసభల్లో అడుగు పెట్టకుండా కాంగ్రెస్ దశాబ్దాలుగా అడ్డు పడుతోందన్నారు. మహిళలకు రాజ్యాధికారం దక్కకూడదనే ఉద్దేశంతో వారసత్వ పార్టీలన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారని తెలిపారు. ‘ చట్టసభల్లో ప్రాతినిధ్యం లభిస్తుందన్న మహిళల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక తెలంగాణ మహిళల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి, మహిళా బిల్లును అడ్డుకొని పైశాచిక ఆనందం పొందిన విషయాన్ని మహిళా లోకం గమనిస్తోంది. అన్ని విధాల మహిళలను వంచిస్తున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు మహిళామణులు తగిన బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరం లేదు అని గోదావరి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ విజయలక్ష్మి, నాయకురాలు భవాని, రాణి తదితరులు ఉన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: యువ పారిశ్రామికవేత్తగా సాధించిన ఘనతకు గాను, వరల్డ్ వండర్స్ రికార్డ్స్ శ్రీ అబి శ్రీ సత్యం…
మనవార్తలు ప్రతినిధి , మియాపూర్ : సేవాదళ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, క్రమశిక్షణ, సేవా భావం శేరిలింగంపల్లి…
ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే వర్ధిల్లాలి శ్రమ సంస్కృతిని గౌరవిద్దాం సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ‘వ్యాపార నిర్ణయం తీసుకోవడం కోసం కృత్రిమ…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని పటాన్చెరు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…