politics

ప్రజలు కాంగ్రెస్ ను నమ్మేపరిస్థితి లేదు బీఆర్‌ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి

 

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం :

తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్‌ఎస్ పార్టీ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి అన్నారు .భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదర్శ్ రెడ్డి హాజరైయ్యారు .సండే మార్కెట్ బాలవిహార్ పార్క్ వద్ద టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు . అనంతరం పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు దిగుతున్నాయి. ప్రజలను మోసం చేయడం తప్ప వారి దగ్గర చెప్పడానికి ఏమీ లేదు” అంటూ మండిపడ్డారు.ఉద్యమ దశ నుంచి పరిపాలన దశ వరకు పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ముందంజలో ఉందని అన్నారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల అభివృద్ధి, రైతు సంక్షేమం వంటి అంశాల్లో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచిందని ,పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, గ్రామీణాభివృద్ధి నుంచి పట్టణ అభివృద్ధి వరకు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధించామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మరింత బలపడుతూ ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఎన్నికల సమయంలో గ్రూపు విభేదాలకు తావు లేకుండా, అందరూ ఒకే తాటిపై నడవాలని ఆదర్శ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, కుమార్ గౌడ్, ఐలేష్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, క్రాంతి, లక్ష్మీనారాయణ, కృష్ణకాంత్, నరసింహ, వెంకటేష్, పెద్ద రాజు, పరమేష్ తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

18 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

19 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

19 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

23 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

23 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

23 hours ago