politics

ప్రజలు కాంగ్రెస్ ను నమ్మేపరిస్థితి లేదు బీఆర్‌ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి

 

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం :

తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్‌ఎస్ పార్టీ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి అన్నారు .భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదర్శ్ రెడ్డి హాజరైయ్యారు .సండే మార్కెట్ బాలవిహార్ పార్క్ వద్ద టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు . అనంతరం పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు దిగుతున్నాయి. ప్రజలను మోసం చేయడం తప్ప వారి దగ్గర చెప్పడానికి ఏమీ లేదు” అంటూ మండిపడ్డారు.ఉద్యమ దశ నుంచి పరిపాలన దశ వరకు పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ముందంజలో ఉందని అన్నారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల అభివృద్ధి, రైతు సంక్షేమం వంటి అంశాల్లో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచిందని ,పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, గ్రామీణాభివృద్ధి నుంచి పట్టణ అభివృద్ధి వరకు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధించామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మరింత బలపడుతూ ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఎన్నికల సమయంలో గ్రూపు విభేదాలకు తావు లేకుండా, అందరూ ఒకే తాటిపై నడవాలని ఆదర్శ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, కుమార్ గౌడ్, ఐలేష్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, క్రాంతి, లక్ష్మీనారాయణ, కృష్ణకాంత్, నరసింహ, వెంకటేష్, పెద్ద రాజు, పరమేష్ తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

admin

Recent Posts

సివిల్ ఇంజనీరింగ్ లో ఆకుల విశాల్ కు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

4 hours ago

మే 10 న పటాన్‌చెరులో 10వ జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు

ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మే 10వ తేదీన పటాన్‌చెరు పీవీ…

4 hours ago

ఈఎస్ ఐ కార్పొరేషన్ నిధులను కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాలి

డిస్పెన్సరీలలో డాక్టర్ల కొరతను నివారించాలి సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు…

4 hours ago

మరోసారి భక్తి భావం చాటిన ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత_ ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ శాస్త్రోక్తంగా మొదలైన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ…

1 day ago

లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్ అధినేత సాయిరాం గుప్తా ఆధ్వర్యంలో చలివేంద్రం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్ చెరు పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా సాయి లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్…

1 day ago

భవిష్యత్తుకు తగ్గ అధ్యాపకులను తీర్చిదిద్దుతాం

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…

3 days ago