Telangana

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

మహిళలు భయం లేకుండా స్వేచ్ఛగా జీవించగల వాతావారణాన్ని సృష్టించడానికి సామూహికంగా బాధ్యత వహించాలని గీతంలోని అప్లైడ్ సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అఫ్రీన్ వసీం అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) ‘పరిశోధన చర్చల’ శ్రేణిలో భాగంగా ఐదవ సెమినార్ ను గురువారం నిర్వహించింది.‘భయంలో జీవించడం: భారతదేశంలోని మహిళలపై లైంగిక హింస ముప్పు యొక్క మానసిక ప్రభావం’ అనే శీర్షికతో జరిగిన ఈ ఉపన్యాసం, లైంగిక హింస యొక్క నిరంతర ముప్పు కారణంగా మహిళలు మోస్తున్న, విస్తృతంగా వ్యాపించి ఉన్న, తరచుగా విస్మరించబడే మానసిక భారాన్ని పరిశీలించింది. ఈ భయం వారి మానసిక ఆరోగ్యాన్ని, ప్రవర్తనను, రోజువారీ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో డాక్టర్ వసీం వివరించారు.అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ‘అనాలిసిస్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ’ (వైలీ) జర్నల్ లో ప్రచురితమైన ఆమె పరిశోధన, అందులోని ప్రధాన అంశాలను డాక్టర్ వసీం వివరించారు.

అనుభవపూర్వక పరిశోధనల ఆధారంగా, సమాజంలో లోతుగా పాతుకుపోయిన, ఈ సవాళ్లను పరిష్కరించడానికి మరింత అవగాహన, విధానపరమైన జోక్యం, బలమైన సహాయక వ్యవస్థల ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు.భయం యొక్క పటం’గా వర్ణించిన ఆరు కీలక అంశాలను డాక్టర్ వసీం సమర్పించారు. బహిరంగ ప్రదేశాలలో నిరంతర అతి జాగరూకత, మారిన జీవన విధానాలు-పరిమితమైన చలనశీలత, మహిళలు అవలంబించే సర్దుబాటు పద్ధతులు, ఆందోళన-భావోద్వేగ అలసట వంటి మానసిక ప్రభావాలు, రక్షణ పేరుతో కుటుంబం విధించే ఆంక్షలు, వ్యవస్థాగత మార్పు కోసం పెరుగుతున్న డిమాండ్లతో పాటు శారీరక హింస లేకపోయినా, భయమే నిజమైన హానిని కలిగించగలదని ఆమె అభిప్రాయపడ్డారు.

అర్థవంతమైన సంస్కరణల కోసం పిలుపునిస్తూ, సకాలంలో న్యాయం, బలమైన చట్ట అమలు, సహాయక కుటుంబ వాతావరణం, బాధితులను నిందించే వైఖరులను సవాలు చేసే సాంస్కృతిక మార్పు యొక్క ఆవశ్యకతను డాక్టర్ వసీం నొక్కి చెప్పారు. న్యాయమైన సమాజానికి మహిళల భద్రతను నిర్ధారించడం ప్రాథమికమని స్పష్టీకరిస్తూ, ఆమె తన ఉపన్యాసాన్ని ముగించారు.జీఎస్ హెచ్ఎస్ సంస్థాగత పరిశోధన కమిటీ నిర్వహించిన ఈ చర్చాగోష్ఠిలో అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. సమకాలీన భారతదేశంలో లింగం, భద్రత, మానసిక శ్రేయస్సుపై విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహిస్తూ, ఆసక్తికరమైన చర్చతో ఈ సమావేశం ముగిసింది.

admin

Recent Posts

గీతంలో క్వాంటం సాంకేతికపై పరిశోధన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…

3 days ago

నిజాయితీ, నిబద్ధత కలిగిన నిస్వార్థ నాయకుడు స్వర్గీయ జి. ఎల్లన్న: మాజీ మంత్రి హరీశ్ రావు

తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…

3 days ago

రఘునాథ్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…

4 days ago

గీతంలో ముగిసిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…

4 days ago

కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం నుండి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టండి

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

5 days ago

డిఆర్డిఏ, మెప్మ, రెవెన్యూ, ఎక్సైజ్, హెచ్ఎండిఎ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష

మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…

5 days ago