Telangana

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

మహిళలు భయం లేకుండా స్వేచ్ఛగా జీవించగల వాతావారణాన్ని సృష్టించడానికి సామూహికంగా బాధ్యత వహించాలని గీతంలోని అప్లైడ్ సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అఫ్రీన్ వసీం అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) ‘పరిశోధన చర్చల’ శ్రేణిలో భాగంగా ఐదవ సెమినార్ ను గురువారం నిర్వహించింది.‘భయంలో జీవించడం: భారతదేశంలోని మహిళలపై లైంగిక హింస ముప్పు యొక్క మానసిక ప్రభావం’ అనే శీర్షికతో జరిగిన ఈ ఉపన్యాసం, లైంగిక హింస యొక్క నిరంతర ముప్పు కారణంగా మహిళలు మోస్తున్న, విస్తృతంగా వ్యాపించి ఉన్న, తరచుగా విస్మరించబడే మానసిక భారాన్ని పరిశీలించింది. ఈ భయం వారి మానసిక ఆరోగ్యాన్ని, ప్రవర్తనను, రోజువారీ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో డాక్టర్ వసీం వివరించారు.అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ‘అనాలిసిస్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ’ (వైలీ) జర్నల్ లో ప్రచురితమైన ఆమె పరిశోధన, అందులోని ప్రధాన అంశాలను డాక్టర్ వసీం వివరించారు.

అనుభవపూర్వక పరిశోధనల ఆధారంగా, సమాజంలో లోతుగా పాతుకుపోయిన, ఈ సవాళ్లను పరిష్కరించడానికి మరింత అవగాహన, విధానపరమైన జోక్యం, బలమైన సహాయక వ్యవస్థల ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు.భయం యొక్క పటం’గా వర్ణించిన ఆరు కీలక అంశాలను డాక్టర్ వసీం సమర్పించారు. బహిరంగ ప్రదేశాలలో నిరంతర అతి జాగరూకత, మారిన జీవన విధానాలు-పరిమితమైన చలనశీలత, మహిళలు అవలంబించే సర్దుబాటు పద్ధతులు, ఆందోళన-భావోద్వేగ అలసట వంటి మానసిక ప్రభావాలు, రక్షణ పేరుతో కుటుంబం విధించే ఆంక్షలు, వ్యవస్థాగత మార్పు కోసం పెరుగుతున్న డిమాండ్లతో పాటు శారీరక హింస లేకపోయినా, భయమే నిజమైన హానిని కలిగించగలదని ఆమె అభిప్రాయపడ్డారు.

అర్థవంతమైన సంస్కరణల కోసం పిలుపునిస్తూ, సకాలంలో న్యాయం, బలమైన చట్ట అమలు, సహాయక కుటుంబ వాతావరణం, బాధితులను నిందించే వైఖరులను సవాలు చేసే సాంస్కృతిక మార్పు యొక్క ఆవశ్యకతను డాక్టర్ వసీం నొక్కి చెప్పారు. న్యాయమైన సమాజానికి మహిళల భద్రతను నిర్ధారించడం ప్రాథమికమని స్పష్టీకరిస్తూ, ఆమె తన ఉపన్యాసాన్ని ముగించారు.జీఎస్ హెచ్ఎస్ సంస్థాగత పరిశోధన కమిటీ నిర్వహించిన ఈ చర్చాగోష్ఠిలో అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. సమకాలీన భారతదేశంలో లింగం, భద్రత, మానసిక శ్రేయస్సుపై విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహిస్తూ, ఆసక్తికరమైన చర్చతో ఈ సమావేశం ముగిసింది.

admin

Recent Posts

ఆర్టీసీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి – రవికుమార్ యాదవ్

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్‌సీయూ డిపో మరియు మియాపూర్…

18 hours ago

కథనం భావోద్వేగంతో అనుసంధానం కావాలి

గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…

18 hours ago

నియోజకవర్గస్థాయి ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…

3 days ago

గీతంలో ఎన్.సీ.సీ.పై అవగాహన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…

3 days ago

మహాత్మ బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం : సమాజంలో అంటరానితనం, వివక్షతకు…

3 days ago

యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం పరిరక్షణకు యోగ అత్యంత అవసరమని ప్రతి ఒక్కరి…

3 days ago