Telangana

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

మహిళలు భయం లేకుండా స్వేచ్ఛగా జీవించగల వాతావారణాన్ని సృష్టించడానికి సామూహికంగా బాధ్యత వహించాలని గీతంలోని అప్లైడ్ సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అఫ్రీన్ వసీం అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) ‘పరిశోధన చర్చల’ శ్రేణిలో భాగంగా ఐదవ సెమినార్ ను గురువారం నిర్వహించింది.‘భయంలో జీవించడం: భారతదేశంలోని మహిళలపై లైంగిక హింస ముప్పు యొక్క మానసిక ప్రభావం’ అనే శీర్షికతో జరిగిన ఈ ఉపన్యాసం, లైంగిక హింస యొక్క నిరంతర ముప్పు కారణంగా మహిళలు మోస్తున్న, విస్తృతంగా వ్యాపించి ఉన్న, తరచుగా విస్మరించబడే మానసిక భారాన్ని పరిశీలించింది. ఈ భయం వారి మానసిక ఆరోగ్యాన్ని, ప్రవర్తనను, రోజువారీ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో డాక్టర్ వసీం వివరించారు.అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ‘అనాలిసిస్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ’ (వైలీ) జర్నల్ లో ప్రచురితమైన ఆమె పరిశోధన, అందులోని ప్రధాన అంశాలను డాక్టర్ వసీం వివరించారు.

అనుభవపూర్వక పరిశోధనల ఆధారంగా, సమాజంలో లోతుగా పాతుకుపోయిన, ఈ సవాళ్లను పరిష్కరించడానికి మరింత అవగాహన, విధానపరమైన జోక్యం, బలమైన సహాయక వ్యవస్థల ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు.భయం యొక్క పటం’గా వర్ణించిన ఆరు కీలక అంశాలను డాక్టర్ వసీం సమర్పించారు. బహిరంగ ప్రదేశాలలో నిరంతర అతి జాగరూకత, మారిన జీవన విధానాలు-పరిమితమైన చలనశీలత, మహిళలు అవలంబించే సర్దుబాటు పద్ధతులు, ఆందోళన-భావోద్వేగ అలసట వంటి మానసిక ప్రభావాలు, రక్షణ పేరుతో కుటుంబం విధించే ఆంక్షలు, వ్యవస్థాగత మార్పు కోసం పెరుగుతున్న డిమాండ్లతో పాటు శారీరక హింస లేకపోయినా, భయమే నిజమైన హానిని కలిగించగలదని ఆమె అభిప్రాయపడ్డారు.

అర్థవంతమైన సంస్కరణల కోసం పిలుపునిస్తూ, సకాలంలో న్యాయం, బలమైన చట్ట అమలు, సహాయక కుటుంబ వాతావరణం, బాధితులను నిందించే వైఖరులను సవాలు చేసే సాంస్కృతిక మార్పు యొక్క ఆవశ్యకతను డాక్టర్ వసీం నొక్కి చెప్పారు. న్యాయమైన సమాజానికి మహిళల భద్రతను నిర్ధారించడం ప్రాథమికమని స్పష్టీకరిస్తూ, ఆమె తన ఉపన్యాసాన్ని ముగించారు.జీఎస్ హెచ్ఎస్ సంస్థాగత పరిశోధన కమిటీ నిర్వహించిన ఈ చర్చాగోష్ఠిలో అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. సమకాలీన భారతదేశంలో లింగం, భద్రత, మానసిక శ్రేయస్సుపై విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహిస్తూ, ఆసక్తికరమైన చర్చతో ఈ సమావేశం ముగిసింది.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

19 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

20 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

20 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

24 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

24 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

24 hours ago