Telangana

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

మహిళలు భయం లేకుండా స్వేచ్ఛగా జీవించగల వాతావారణాన్ని సృష్టించడానికి సామూహికంగా బాధ్యత వహించాలని గీతంలోని అప్లైడ్ సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అఫ్రీన్ వసీం అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) ‘పరిశోధన చర్చల’ శ్రేణిలో భాగంగా ఐదవ సెమినార్ ను గురువారం నిర్వహించింది.‘భయంలో జీవించడం: భారతదేశంలోని మహిళలపై లైంగిక హింస ముప్పు యొక్క మానసిక ప్రభావం’ అనే శీర్షికతో జరిగిన ఈ ఉపన్యాసం, లైంగిక హింస యొక్క నిరంతర ముప్పు కారణంగా మహిళలు మోస్తున్న, విస్తృతంగా వ్యాపించి ఉన్న, తరచుగా విస్మరించబడే మానసిక భారాన్ని పరిశీలించింది. ఈ భయం వారి మానసిక ఆరోగ్యాన్ని, ప్రవర్తనను, రోజువారీ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో డాక్టర్ వసీం వివరించారు.అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ‘అనాలిసిస్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ’ (వైలీ) జర్నల్ లో ప్రచురితమైన ఆమె పరిశోధన, అందులోని ప్రధాన అంశాలను డాక్టర్ వసీం వివరించారు.

అనుభవపూర్వక పరిశోధనల ఆధారంగా, సమాజంలో లోతుగా పాతుకుపోయిన, ఈ సవాళ్లను పరిష్కరించడానికి మరింత అవగాహన, విధానపరమైన జోక్యం, బలమైన సహాయక వ్యవస్థల ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు.భయం యొక్క పటం’గా వర్ణించిన ఆరు కీలక అంశాలను డాక్టర్ వసీం సమర్పించారు. బహిరంగ ప్రదేశాలలో నిరంతర అతి జాగరూకత, మారిన జీవన విధానాలు-పరిమితమైన చలనశీలత, మహిళలు అవలంబించే సర్దుబాటు పద్ధతులు, ఆందోళన-భావోద్వేగ అలసట వంటి మానసిక ప్రభావాలు, రక్షణ పేరుతో కుటుంబం విధించే ఆంక్షలు, వ్యవస్థాగత మార్పు కోసం పెరుగుతున్న డిమాండ్లతో పాటు శారీరక హింస లేకపోయినా, భయమే నిజమైన హానిని కలిగించగలదని ఆమె అభిప్రాయపడ్డారు.

అర్థవంతమైన సంస్కరణల కోసం పిలుపునిస్తూ, సకాలంలో న్యాయం, బలమైన చట్ట అమలు, సహాయక కుటుంబ వాతావరణం, బాధితులను నిందించే వైఖరులను సవాలు చేసే సాంస్కృతిక మార్పు యొక్క ఆవశ్యకతను డాక్టర్ వసీం నొక్కి చెప్పారు. న్యాయమైన సమాజానికి మహిళల భద్రతను నిర్ధారించడం ప్రాథమికమని స్పష్టీకరిస్తూ, ఆమె తన ఉపన్యాసాన్ని ముగించారు.జీఎస్ హెచ్ఎస్ సంస్థాగత పరిశోధన కమిటీ నిర్వహించిన ఈ చర్చాగోష్ఠిలో అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. సమకాలీన భారతదేశంలో లింగం, భద్రత, మానసిక శ్రేయస్సుపై విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహిస్తూ, ఆసక్తికరమైన చర్చతో ఈ సమావేశం ముగిసింది.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

4 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

4 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

10 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

22 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

22 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

23 hours ago