Telangana

కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు హైకోర్టు చెక్

“కాళేశ్వరం నిజం బయటపడింది 

బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం”

“రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి

ప్రజల దృష్టి మళ్లించేందుకు డ్రామాలు చేస్తున్న ప్రభుత్వం”

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ప్రభుత్వం చేపట్టిన రాజకీయ కక్షసాధింపులకు గట్టి చెంపపెట్టుగా నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి అన్నారు . పటాన్‌చెరు నియోజకవర్గం ఇన్స్పెక్షన్ బంగ్లాలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ హైకోర్టు తాజా తీర్పును ఆయన స్వాగతించారు.గత మూడు సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చేసిన ఆరోపణలు న్యాయస్థానం ముందు బట్టబయలయ్యాయని, రైతులకు నీరు అందించాల్సిన ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురిచేసిందని పేర్కొన్నారు.అదేవిధంగా, ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి సారించాలని, రైతు బంధు, రైతు భీమా పథకాలను సమర్థంగా కొనసాగించాలని ఆయన సూచించారు. అలాగే ప్రజాపాలనపై దృష్టి పెట్టాలని, ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలు పక్కనపెట్టి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , పటాన్‌చెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ , జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలాను బాల్‌రెడ్డి , రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్ , కౌన్సిలర్లు నవీన్ కుమార్, సురేష్, సతీష్, రవీందర్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకులు పృథ్వీరాజ్, మాణిక్ యాదవ్, బీఆర్ఎస్ సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ బూన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రకాశ్ చారి, జగన్నాథ్ రెడ్డి, గణేష్, మాజీ సర్పంచ్ ఖాదిర్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మహిళలు భయం లేకుండా…

8 hours ago

ఆర్టీసీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి – రవికుమార్ యాదవ్

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్‌సీయూ డిపో మరియు మియాపూర్…

1 day ago

కథనం భావోద్వేగంతో అనుసంధానం కావాలి

గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…

1 day ago

నియోజకవర్గస్థాయి ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…

3 days ago

గీతంలో ఎన్.సీ.సీ.పై అవగాహన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…

3 days ago

మహాత్మ బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం : సమాజంలో అంటరానితనం, వివక్షతకు…

3 days ago