Telangana

నూతన సాంకేతికతతో మరిన్ని సవాళ్లు తథ్యం

_గీతం అధ్యాపకులతో టెలికాం నియంత్రణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పీడీ వాఘేలా

_ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికాం రంగం ఇండియాదే 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతికత వల్ల మనం మరిన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదని, అది కొత్త ఉత్పత్తులతో రావడమే గాక అప్పటికే ఆ రంగంలో ఉన్నవారిని కలవరపెట్టడం ఖాయమని టె టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చైర్మన్ డాక్టర్ సీడీ వాఘేలా అన్నారు. ట్రాయ్ కార్యదర్శి వి.రఘునందన్ తో కలిసి గీతం, హైదరాబాద్ అధ్యాపకులతో శుక్రవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం పరిశోధనపై దృష్టి పెట్టకపోతే, అంతర్జాతీయ విలువ మార్పు వ్యవస్థలో ఇమడలేమని, ఈ వ్యవస్థలో భారత స్థానం అంత బలంగా లేదన్నారు. కమ్యూనికేషన్, ప్రసారాలలో ప్రాథమిక పరిశోధనలో మనం వెనుకబడ్డా, ఆచరణాత్మక పరిశోధనలో మాత్రం బలంగా ఉన్నట్టు చెప్పారు. ట్రాయ్ ప్రభుత్వం కాదని, కేవలం నియంత్రణ సంస్థ మాత్రమేనని, అయితే టెలికాం టారిఫ్ లను మార్కెట్ లోని సర్వీస్ ప్రొవైడర్లకే వదిలివేశామని, అందువల్లనే ప్రపంచంలోని చాలా దేశాలకన్నా తక్కువ ధరకు 170 కోట్ల మందికి మొబైల్ సేవలను అందించగలుగుతున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వీలైన కొత్త సేవలు, కొత్త సర్వీస్ ప్రొవైడర్లు వచ్చినప్పుడు, తాము ప్రభుత్వానికి తగు సిఫారసులు చేస్తానున్నారు.

కృత్రిమ మేథ (ఏఐ) గురించి మాట్లాడుతూ, ఏఐలో సమగ్ర పర్యావరణ వ్యవస్థను ప్రతిపాదించిన ప్రపంచంలోని కొన్ని దేశాలలో మనమూ ఒకరమని చెప్పారు. ఇది విద్య, ఆరోగ్య రంగాలలో సహాయపడుతోందని, అపారమైన ప్రయోజనాలను కలిగి ఉందన్నారు. మనదేశం ఏఐ, ఆగ్ మెంట్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్) రోబోటిక్స్, యంత్రం నుంచి యంత్రంలోకి (ఎంఎల్) ప్రవేశించడం వంటి రంగాలన్నింటిలోకి భారత్ ప్రవేశిస్తోందని చెప్పారు. ఈ సాంకేతికల వల్ల కొన్ని ప్రతికూలతలున్నా, వాటిని అధిగమించి సానుకూలతతో సమతుల్యం చేయడానికి యత్నిస్తున్నామన్నారు. భారతదేశం డిజిటిల్ ఆర్థిక వ్యవస్థ మూడేళ్ల క్రితం నిరుత్సాహంగానే ఉన్నా, ప్రస్తుతం మొత్తం ఆర్థిక వ్యవస్థలో 15 శాతానికి చేరినట్టు హర్షధ్వానాల మధ్య డాక్టర్ వాఘేలా వెల్లడించారు. మరో ఐదు, పదేళ్లలో చెప్పుకోదగ్గ మార్పును చూడబోతున్నట్టు ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికాం రంగం మనదని, తాము డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తొమ్మిది సమాంతర వ్యవస్థలైన కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించారు.

అప్లికేషన్ల రూపంలో యూపీఐని ప్రజలకు అందుబాటులోకి తేవడం వల్ల ప్రపంచంలోనే 40 శాతం డిజిటల్ లావాదేవీలు మనదేశంలో జరుగుతున్నట్టు హర్షాతిరేకాల మధ్య వెల్లడించారు. ఈ యూపీఐని మరో ఇరవై దేశాలు అమలు చేస్తున్నాయన్నారు. మన డిజిటల్ టెక్నాలజీని సార్క్ ఆఫ్రికాతో పాటు ఐరోపా దేశాలకు కూడా అందజేస్తున్నట్టు వాఘేలా చెప్పారు. మనదేశం 4, 5, 6 సాంకేతికలను కూడా అభివృద్ధి చేసి ప్రపంచ నాయకత్వ స్థానంలో ఉండి, పలు దేశాల ఆదరాభిమానలను చూరగొంటోందని డాక్టర్ డీపీ వాఘేలా తెలిపారు. 4జీ సాంకేతిక వల్ల చిన్న విక్రేతలు కూడా స్కాన్ ద్వారా నగదు రహిత లావేదేవీలు చేసే వీలు కల్గిందన్నారు. అయితే ఇందులో కొన్ని లోటుపాట్లు లేకపోలేదని, చిన్న పాటి తప్పిదానికే మన ఖాతాలలోని నగదు కొల్లగొట్టి నిలుందని, దానిని సరిగా అరికట్టపోతే ఈ డిజిటల్ లావాదేవీల వైపు ప్రజలంతా మొగ్గు చూపరని ఆయన హెచ్చరించారు. 5జీ సాంకేతికతను చౌక ధరకు, అందరికీ అందుబాటులోకి వస్తే విద్యార్థులు, రైతులు, మత్స్యకారులకు ఎంతో ఉపయోగం కలుగుతుందని, ఇది ట్రాయ్ కు పెద్ద సవాలే అయినా, దాన్ని తాము పరిశోధిస్తున్నట్టు చెప్పారు.

రాబోయే ఐదేళ్లలో పౌరుల కోసం భారీ సంఖ్యలో సులువుగా వినియోగించుకోగలిగేలా చేయాల్సిన అవసరం ట్రాయ్ ఉందని చెర్మన్ తెలిపారు. తొలుత, ట్రాయ్ అత్యున్నతాధికారులు జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించి, ఆ తరువాత దక్షిణ కొరియ ప్రభుత్వ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఇండో-కొరియన్ ప్రొజెక్టు ఎండ్ టర్బెన్లను వారు సందర్శించారు.గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీఆర్ శాస్త్రి, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు ఆతిథులను స్వాగతించారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ వీకే శ్రీధర్ విండ్ టర్నెల్ ప్రాజెక్టు పరిశోధన, దాని పురోగతి గురించి వివరించారు. ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సూర్య ప్రకాశ్ గజ్జలు కూడా ట్రాయ్ బృందంతో పాటు వచ్చారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago