Telangana

ఉన్నత ఆలోచనలున్న +2 స్కూళ్లతో కలిసి పనిచేయడానికి సిద్ధం: గీతం అధ్యక్షుడు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

విద్యలో కొత్త ఆలోచనలు, ఉన్నతాశయాలతో ఆధునిక పోకడలను ప్రవేశపెట్టాలని అభికసించే మాధ్యమిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ చెప్పారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లో బుధవారం నిర్వహించిన ‘భారతీయ విద్యా నాయకత్వ సమ్మేళనం’ను ఉద్దేశించి ఆయన వర్చువల్ గా ప్రసంగించారు.భారతదేశ నలుమూలల నుంచి వచ్చిన వివిధ సీబీఎస్ఈ పాఠశాలలు, ఐబీ స్కూల్స్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఉద్దేశించిన మాట్లాడుతూ, తాము లిబరల్ ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యం ఇస్తున్నామని , కలిసోచ్చే పాఠశాలలతో కలిసి పయనించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కృత్రిమ మేథ వల్ల ఇటీ రంగంలోని చాలా ప్రాథమిక స్థాయి ఉద్యోగాలు రానున్న రెండు మూడేళ్లలో కోల్పోతామని, అందువల్ల విద్యార్థుల సంపూర్ణ పరిణితికి బాటలు వేసి లిబరల్ ఎడ్యుకేషన్ వెపు రాము జాతీయ విద్యా విధానం-2020 కంటే ముందు అడుగేసినట్టు చెప్పారు. తమ విద్యార్థులు నైపుణ్యం గలవారిగా ఎదగడానికి కృషిచేస్తున్నట్లు చెప్పారు.

అందుకు అనుగుణంగా పరిశోధన, నాణ్యత గల అధ్యాపకులు, ప్రపంచ శ్రేణి తరగతి గదులు, ప్రగతిశీల వాతావరణాన్ని తమ వర్సిటీలో సృష్టించేందుకు అధిక మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నట్టు శ్రీభరత్ చెప్పారు.గీతం ప్రయోగశాలలను సందర్శించమని సదస్సులో పాల్గొన్న ప్రిన్స్ పాళ్లందరికీ ఆయన సూచించారు. కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ద్వారా విధాన నిర్ణయంలో మాస్టర్స్ ప్రోగ్రాము నిర్వహిస్తూ, ప్రపంచ స్థాయి విద్య ఆవశ్యకతను చాటిచెబుతున్నామన్నారు.ఈ సందర్భంగా, ఉన్నత విద్యలో లిబరల్ ఆర్ట్స్, స్టెమ్ను ఏకీకృతం చేసి వినూత్న మార్గాలను అన్వేషించ డంతో పాటు ఉన్నత విద్యలో ఆవిష్కరణలపై ప్యానెల్ చర్చను నిర్వహించారు. ఈఎంఐ సర్వీసెస్ ఇండియా సహ-వ్యవస్థాపకురాలు లక్ష్మీ అన్నపూర్ణ ఈ సందర్భంగా ప్రసంగించారు.తొలుత, గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు స్వాగతోపన్యాసం చేశారు. వ్యవస్థాపకులుగా విద్యార్థులు ఎదిగేందుకు గీతం చేపట్టిన పలు చర్యలను వివరించడంతో పాటు, నచ్చే వేసవిలో విద్యార్థుల కోసం ఉచితంగా సమ్మర్ స్కూల్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.గీతమ్ లోని వివిధ స్కూళ్ల డెరైక్టర్లు తాము నిర్వహిస్తున్న కోర్సులు, ఇతరత్రా వివరాలను ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఒకరోజు కార్యక్రమం ఆహ్లాదకరమైన భోజనంతో ముగిసింది.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

14 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago