Telangana

జీజీబీఎస్ఈ సిమెంట్ వినియోగాన్ని తగ్గించొచ్చు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఉక్కు పరిశ్రమలో ఉప ఉత్పత్తి అయిన గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ (జీజీబీఎస్)ను వినియోగించి సిమెంట్ వాడకాన్ని 25 నుంచి 70 శాతం వరకు తగ్గించవచ్చని జేఎసీడబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పణ్ముఖ రెడ్డి చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ‘అధ్వరస్థంలో మన్నికెన్ట్, స్థిరమెనై, పర్యావరణ హిత కాంక్రీట్ కోసం స్లాగ్ బేస్డ్ ఉత్పత్తి వినియోతంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.ఓపీసీగా పిలిచే సాధారణ పోర్ట్ల్యాండ్ సిమెంట్ వంటి సంప్రదాయ వనరుల లభ్యత క్షీణిస్తున్నందున, భవిష్యత్తు తరాలకు ప్రత్యామ్నాయ సిమెంటేషన్ పదార్థాల అవసరం ఏర్పడిందన్నారు. సిమెంట్ ఉత్పత్తి కాలుష్యానికి దారితీస్తున్నందున, పర్యావరణ పరిరక్షణకు, నిర్మాణ అవసరాలను తీర్చడానికి ఫ్లెయాప్, మెక్రో సిలికా, వరిపొట్టు, జీజీబీఎస్ వంటి ప్రత్యామ్నాయాల అన్వేషణ మొదలైందన్నారు.జీజీబీఎస్ను ఉపయోగించడం ద్వారా థర్మల్ క్రాస్లు, ప్రాజెక్టు ఖర్చు, వేడిని గణనీయంగా తగ్గించడమే గాక కాంక్రీటు నిర్మాణాల మన్నిక పెరిగి, దీర్ఘకాలం దృఢంగా ఉంటాయని పణ్ముఖరెడ్డి చెప్పారు. మట్టి స్థిరీకరణలో కూడా జీజీబీఎస్ క్రియాశీలపాత్ర పోషిస్తోందని, తద్వారా జాతీయ రహదారులు, సబ్వేలలో దీని వినియోగం పెరిగిందన్నారు. గీతం ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటి, ఆకుపచ్చ, స్వచ్ఛమైన పర్యావరణ ప్రాముఖ్యతను చాటిచెప్పారు.సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ అఖిలేష్ చేపూరి అతిథిని సత్కరించి, గీతం-జేఎస్ డబ్ల్యూల మధ్య నిరంతర భాగస్వామ్యం కొనసాగాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ విద్యార్థులు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

5 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago