Telangana

శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులకు సూచించారు.బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో అభివృద్ధి పనులపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రగతి పై సమీక్ష నిర్వహించారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడి అనంతరం దశాబ్దికాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్పూర్తితో పని చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు. ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయం తదితర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని, నిధుల కొరత ఉంటే తనను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సిఎస్ఆర్ ద్వారా నిధులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.నియోజకవర్గం కేంద్రమైన పటాన్చెరు లోని వ్యవసాయ మార్కెట్ యార్డును విస్తరిస్తున్నామని, యార్డ్ సమీపంలో గల రైల్వే శాఖకు సంబంధించిన 20 ఎకరాల భూమిని మార్కెట్ యార్డ్ కు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని తెలిపారు.ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకుజవాబుదారీగా పని చేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలో సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago