Telangana

శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులకు సూచించారు.బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో అభివృద్ధి పనులపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రగతి పై సమీక్ష నిర్వహించారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడి అనంతరం దశాబ్దికాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్పూర్తితో పని చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు. ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయం తదితర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని, నిధుల కొరత ఉంటే తనను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సిఎస్ఆర్ ద్వారా నిధులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.నియోజకవర్గం కేంద్రమైన పటాన్చెరు లోని వ్యవసాయ మార్కెట్ యార్డును విస్తరిస్తున్నామని, యార్డ్ సమీపంలో గల రైల్వే శాఖకు సంబంధించిన 20 ఎకరాల భూమిని మార్కెట్ యార్డ్ కు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని తెలిపారు.ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకుజవాబుదారీగా పని చేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలో సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago