politics

డబల్ బెడ్ రూమ్ ఇళ్లకి సంబంధించిన నిధుల శ్వేతపత్రం విడుదల చేయాలి _మాజీజడ్పీటీసీ   గడిలశ్రీకాంత్ గౌడ్

మనవార్తలు,పటాన్ చెరు:

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పేదలను దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ జడ్పీటీసీ   గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కర్దనూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను భారతీయ జనతాపార్టీ నాయకులు పరిశీలించారు. అనంతరం భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి మాజీ జెడ్పిటిసి గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని అన్నారు .

 

డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందని వెల్లడించాలని ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎంత మంది పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేశారని నిరుపేదలైన స్థానికులకు మరియు దశాబ్దాలుగా స్థానికంగా స్థిరపడిన నిరుపేదలకు అందించడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది ఎప్పుడు అందుబాటులోకి తేస్తారో  రాష్ట్ర ప్రజలకు తెలపాలని లేదంటే డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కి సంబంధించిన నిధుల శ్వేతపత్రం విడుదల చేయాలని  లేదంటే రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేసే వరకు పెద్ద ఎత్హున ఉద్యమిస్తామని గడిల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య, శ్రీనివాసగుప్త అసెంబ్లీ కన్వీనర్, దేవేందర్ గౌడ్ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్య వర్గ సభ్యులు, బైండ్ల కుమార్ జిల్లా కార్యాదర్శి, శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి, పుణ్యవతి మహిళ మోర్చా జిల్లా, జన్సీ మండల నాయకురాలు, జగన్ రెడ్డి, బాలచారీ, మధుకర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు .

 

 

 

admin

Recent Posts

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

7 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

7 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

7 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

7 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

1 day ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

1 day ago