Districts

నకిలీ భూడాక్యుమెంట్లు సృష్టించిన ముఠాఅరెస్ట్

మనవార్తలు,పటాన్చెరు:

చనిపోయిన వ్యక్తి పేరును వాడుకుంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూవిక్రయాలు చేస్తూ కోట్లాది రూపాయాల అక్రమాలకు పాల్ప డుతున్న ఘరానా ముఠా సభ్యులను పోలీసులు చాకచక్యంగా అదుపు లోకి తీసుకున్నారు, వారి వద్ధ నుండి 27 లక్షల 56వేల రూపాయల నగదు ను స్వాధీనం చేసుకొని నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. పటాన్ చెరు డీఎస్పీభీంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ శివారులోని సర్వేనెంబర్ 251 లోని దాదాపు 880 చదరపు గజాల స్థలం మధీనా గూడకు చెందిన యం.సునంద 2000సంవత్సరంలో కొనుగోలు చేసింది. కాగా ఇటీవల తన స్ధలాన్ని కొందరు కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయటంతో ఆమె పటాన్ చెరు పోలీసులను ఆశ్రయించింది.

అయితే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి లక్ష్మారెడ్డి, ఖలీల్,చంద్రశేఖర్ రెడ్డి అభయ్ , చాకలి గణేష్, ప్రవీణ్ రెడ్డి, అనంత, శివ , ప్రకాష్ లు పధకం ప్రకారం చనిపోయిన స్ధానిక నేత జైపాల్ రెడ్డి పేరును వాడుకుంటూ సదరు స్ధలాన్ని నకిలీ పత్రాలు, ఆధార్ కార్డు లు సృష్టించి దాదాపు ఐదు కోట్లకు ఇస్నాపూర్ కు చెందిన మహ్మద్ ఆలికి విక్రయించారు. అడ్వాన్స్ గా కోటి ఇరవై ఏడు లక్షలు కూడా తీసుకుని నిందితులు పంచుకున్నారు. కాగా సునంద ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేయటంతో అసలు నిజాలు నిగ్గు తేల్చారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లను విక్రయిస్తున్న ముఠా సభ్యులు తొమ్మిది మందిలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వద్ద నుంచి 27లక్షల 56వేల నగదును స్వాధీనం చేసుకున్నామని, ప్రధాన నిందితులన లక్ష్మారెడ్డి,ఖలీల్, శివలను త్వరలోనే పట్టుకుంటామని  డీఎస్పీభీంరెడ్డి వెల్లడించారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago