Districts

భౌతిక , మిశ్రమ పదార్థాల వృద్ధిపై అధ్యాపక వికాస కార్యక్రమం…

మనవార్తలు,పటాన్ చెరు:

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ భౌతిక , మిశ్రమ పదార్థాల ఆధునిక పోకడల’పై మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ( ఎస్ఓడీపీ ) ని మార్చి 23-25 తేదీలలో నిర్వహించనున్నట్టు ఆ విభాగాధిపతి డాక్టర్ సి.శ్రీనివాస్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . పదార్థ శాస్త్రం , సాంకేతికత అనేది భౌతిక లక్షణాలు , సూక్ష్మ నిర్మాణాలపై దృష్టిసారించే అంతర్ విభాగ అంశమన్నారు . పారిశ్రామిక , సామాజిక – ఆర్థిక వృద్ధికి అవసరమైన సాంకేతిక ప్రక్రియల కోసం వినూత్న పదార్థాల రూపకల్పన , అభివృద్ధితో పాటు పురోగతికి దారితీసినట్టు తెలిపారు . అదే సమయంలో కొన్ని కొత్త సమస్యలు కూడా వెలుగులోకి వచ్చాయన్నారు . నానోమెటీరియల్స్ , నానాటెక్నాలజీ , స్మార్ట్ మెటీరియల్స్ , ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్ల కోసం హైఎంట్రోపీ మెటీరియల్స్ వంటి అంశాలపై ఈ మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమంలో విరివిగా చర్చిస్తారని తెలిపారు .

విద్యా సంస్థలు , పరిశ్రమ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులతో కీలక ఉపన్యాసాలు , మరో ముగ్గురు నిపుణులతో చర్చలు , రెండు ప్రయోగాత్మక శిక్షణ కార్యక్రమాలు , పరిశ్రమ నిపుణులతో ప్యానెల్ చర్చ వంటివి ఉంటాయన్నారు . పేర్ల నమోదు , వసతి తదితర వివరాల కోసం https://forms.gle/Gb3hnlJbkaUQspPG9 లాగిన్ అవ్వాలని , డాక్టర్ వి.జీవన్ , సమన్వయకర్త ( 77948 35203 ) ని సంప్రదించాలని లేదా jvemula@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని ఆయన సూచించారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago