మనవార్తలు,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ భౌతిక , మిశ్రమ పదార్థాల ఆధునిక పోకడల’పై మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ( ఎస్ఓడీపీ ) ని మార్చి 23-25 తేదీలలో నిర్వహించనున్నట్టు ఆ విభాగాధిపతి డాక్టర్ సి.శ్రీనివాస్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . పదార్థ శాస్త్రం , సాంకేతికత అనేది భౌతిక లక్షణాలు , సూక్ష్మ నిర్మాణాలపై దృష్టిసారించే అంతర్ విభాగ అంశమన్నారు . పారిశ్రామిక , సామాజిక – ఆర్థిక వృద్ధికి అవసరమైన సాంకేతిక ప్రక్రియల కోసం వినూత్న పదార్థాల రూపకల్పన , అభివృద్ధితో పాటు పురోగతికి దారితీసినట్టు తెలిపారు . అదే సమయంలో కొన్ని కొత్త సమస్యలు కూడా వెలుగులోకి వచ్చాయన్నారు . నానోమెటీరియల్స్ , నానాటెక్నాలజీ , స్మార్ట్ మెటీరియల్స్ , ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్ల కోసం హైఎంట్రోపీ మెటీరియల్స్ వంటి అంశాలపై ఈ మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమంలో విరివిగా చర్చిస్తారని తెలిపారు .
విద్యా సంస్థలు , పరిశ్రమ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులతో కీలక ఉపన్యాసాలు , మరో ముగ్గురు నిపుణులతో చర్చలు , రెండు ప్రయోగాత్మక శిక్షణ కార్యక్రమాలు , పరిశ్రమ నిపుణులతో ప్యానెల్ చర్చ వంటివి ఉంటాయన్నారు . పేర్ల నమోదు , వసతి తదితర వివరాల కోసం https://forms.gle/Gb3hnlJbkaUQspPG9 లాగిన్ అవ్వాలని , డాక్టర్ వి.జీవన్ , సమన్వయకర్త ( 77948 35203 ) ని సంప్రదించాలని లేదా jvemula@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని ఆయన సూచించారు
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…