మనవార్తలు,పటాన్ చెరు:
మూడు కోట్ల రూపాయల వ్యయంతో పటాన్ చెరు నడిబొడ్డున నిర్మించిన గాంధీ పార్క్ ను అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్యతో కలిసి పార్కులో చేపడుతున్న పనులను పరిశీలించారు. వచ్చే వారం రోజుల్లోగా అన్ని పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అతి త్వరలో పటాన్చెరు కి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారని, ఆయన చేతుల మీదుగా పార్కును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, నగేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విద్యార్థులకు మార్గనిర్దేశం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో విద్యార్థులకు…
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…