politics

డబల్ బెడ్ రూమ్ ఇళ్లకి సంబంధించిన నిధుల శ్వేతపత్రం విడుదల చేయాలి _మాజీజడ్పీటీసీ   గడిలశ్రీకాంత్ గౌడ్

మనవార్తలు,పటాన్ చెరు:

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పేదలను దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ జడ్పీటీసీ   గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కర్దనూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను భారతీయ జనతాపార్టీ నాయకులు పరిశీలించారు. అనంతరం భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి మాజీ జెడ్పిటిసి గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని అన్నారు .

 

డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందని వెల్లడించాలని ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎంత మంది పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేశారని నిరుపేదలైన స్థానికులకు మరియు దశాబ్దాలుగా స్థానికంగా స్థిరపడిన నిరుపేదలకు అందించడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది ఎప్పుడు అందుబాటులోకి తేస్తారో  రాష్ట్ర ప్రజలకు తెలపాలని లేదంటే డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కి సంబంధించిన నిధుల శ్వేతపత్రం విడుదల చేయాలని  లేదంటే రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేసే వరకు పెద్ద ఎత్హున ఉద్యమిస్తామని గడిల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య, శ్రీనివాసగుప్త అసెంబ్లీ కన్వీనర్, దేవేందర్ గౌడ్ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్య వర్గ సభ్యులు, బైండ్ల కుమార్ జిల్లా కార్యాదర్శి, శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి, పుణ్యవతి మహిళ మోర్చా జిల్లా, జన్సీ మండల నాయకురాలు, జగన్ రెడ్డి, బాలచారీ, మధుకర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు .

 

 

 

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

15 hours ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

15 hours ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago