పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్-విశాఖపట్టణంలు సంయుక్తంగా ‘ఆర్కిటెక్చర్లో విజయవంతమైన కెరీర్’ అనే అంశంపై జనవరి 21, 2023న (శనివారం) మధ్యాహ్నం 2.30 నుంచి 4.00 గంటల మధ్య వెబినారు నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ వెల్లడించారు.తాము గత ఏడాది నుంచి వరుసగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ వెబినార్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.గ్లాస్గో (స్కాట్లాండ్)లోని స్ట్రాక్లైడ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టభద్రురాలు, విద్యావేత్త, ప్రముఖ రూపశిల్పి కృష్ణకోళి దత్తా ఈ వెబినార్లో ముఖ్య వక్తగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు.ఆసక్తి ఉన్నవారు జూమ్ లింక్ http://surl.li/csbjt ద్వారా ఈ వెబినార్లో పాల్గొనవచ్చని, ఇతర వివరాల కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ స్నిగ్ధా రాయ్ sroy2@gitam.eduకు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విద్యార్థులకు మార్గనిర్దేశం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో విద్యార్థులకు…
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…