Telangana

నియోజకవర్గంలో కంటి వెలుగు అమలుపై అధికారులతో సమీక్షా సమావేశం

_కార్యక్రమం ప్రాధాన్యతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి

_అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు పాల్గొనండి

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్రంలో ఏ ఒక్కరు కంటి సమస్యతో బాధపడకూడదన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారని, గురువారం నుండి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రారంభంకానున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు..కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని స్థాయిల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ తేదీ బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, 19వ తేదీ నుండి నియోజకవర్గంలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతి రోజు ప్రతి గ్రామ పరిధిలో ఏర్పాటుచేసిన శిబిరంలో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు, అవసరమైన వారికి తక్షణమే నాణ్యమైన రీడింగ్ గ్లాసెస్ అందించడంతో పాటు, ప్రిస్క్రిప్షన్ అద్దాలు అవసరమైన వారికి రెండు వారాలలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్లు అవసరమైన వారికి ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకుగాను పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు ఆపరేషన్లు అవసరమైన వారి జాబితాను సేకరించాలని సూచించారు.అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు పూర్తి అంకితభావంతో పనిచేస్తే కంటి వెలుగు విజయవంతం అవ్వడమే కాకుండా, గ్రామాలలో మంచి పేరు వస్తుందని అన్నారు.గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికి కంటి వెలుగు కార్యక్రమం పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరానికి హాజరయ్యేలా చూడాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి నియోజకవర్గంలో వంద శాతం విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో కంటి వెలుగు నియోజకవర్గ ప్రత్యేక అధికారి డాక్టర్ మనోహర్ రెడ్డి, వివిధ స్థాయిల అధికారులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

13 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago