Categories: politicsTelangana

కళలపై గీతమ్ జాతీయ సదస్సు…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

లలిత కళలు, వాటి ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ‘ప్రదర్శనాత్మక భారతం’ (పెర్ఫార్మేటివ్ ఇండియా) పేరిట ఈనెల 27న ఒకరోజు జాతీయ సదస్సును నిర్వహించనున్నది. ఈ విషయాన్ని లలిత కళలు విభాగం సమన్వయకర్త, సదస్సు నిర్వాహకురాలు డాక్టర్ మెథైలి మరాట్ అనూప్ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు.హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఎస్.ఎన్. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నృత్య విభాగం ప్రొఫెసర్, నటి డాక్టర్ అరుణ భిక్షు ముఖ్య వక్తగా పాల్గొంటారని తెలియజేశారు. ఐఐటీ బాంబేలోని భాష-సాహిత్య అధ్యయనాల విశ్రాంత ఆచార్యుడు, హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు డాక్టర్ మిలింద్ మల్లే మరో వక్తగా పాల్గొంటారన్నారు.’సమకాలీన కాలంలో ప్రదర్శనల సౌందర్యం: డిజిటల్ యుగంలో వాటి తీరుతెన్నులు’ అనే అంశంపై నిర్వహించనున్న చర్చాగోష్ఠిలో ఐఐటీ హైదరాబాద్ లోని డిజెన్డ్ విభాగానికి చెందిన డాక్టర్ దీపక్ జాన్ మాథ్యూ; కేరళకు చెందిన ప్రముఖ థియేటర్ ప్రాక్టీషనర్ ప్రొఫెసర్ చంద్ర దాసన్; సిలికాన్ ఆంధ్రా విశ్వవిద్యాలయం-త్రిబుల్ ఐటీ హెదరాబాద్ లోని సంగీత విభాగం అధ్యాపకులు డాక్టర్ టీకేఎల్ సరోజలు పాల్గొంటారని ఆమె వివరించారు.యునెస్కో గుర్తింపు పొందిన సాంప్రదాయ భారతీయ కళారూపం ‘కుటియాట్టం’ను సదస్సు ముగింపు సమయంలో ప్రదర్శిస్తారని డాక్టర్ మెథైలి తెలిపారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago