Telangana

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి

_ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 45 గ్రామ పంచాయతీలకు 5 కోట్ల 25 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, వీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అందించే నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ఖర్చు చేయాలని కోరారు. ప్రధానంగా సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు వెచ్చించాలని సూచించారు. దీంతోపాటు 9 నూతన గ్రామపంచాయతీలలో పంచాయతీ భవనాల నిర్మాణ పనుల కోసం 20 లక్షల రూపాయల చొప్పున ఒక కోటి లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసే నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమస్యల గురించి ప్రశ్నించిన విద్యార్థులకు వేధింపులా

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

3 hours ago

పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలి

సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…

3 hours ago

లక్డారం రైతుల భూములను రక్షించాలి

ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…

3 hours ago

గీతంలో ఉత్సాహభరితంగా యోగా దినోత్సవం

ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ…

3 hours ago

ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…

17 hours ago

యండిఆర్ ఫౌండేషన్ కు 23వ జాతీయ అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ఖాతాలో మ‌రో అవార్డు ద‌క్కింది .…

17 hours ago