ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ విధానంగా ప్రోత్సహించేందుకు, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడా విభాగం సోమవారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహభరితంగా జరుపుకుంది. ప్రాంగణంలోని అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను గాంధీ స్క్వేర్ లో ఒకచోట చేర్చి యోగ సాధన చేయించారు.అన్ని వయస్సుల వారిలో శారీరక శక్తి, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత, ఆరోగ్యకరమైన దీర్ఘాయువును ప్రోత్సహించడంలో యోగా పాత్రను నొక్కి చెప్పే ఈ ఏడాది విశ్వవ్యాప్త ఇతివృత్తం ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’కు అనుగుణంగా ఈ వేడుకను నిర్వహించారు.శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగాభ్యాసాల ప్రాముఖ్యత, వాటి ప్రాధాన్యతపై పరిచయంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
దీని తరువాత, భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన కామన్ యోగా ప్రోటోకాల్ కు అనుగుణంగా యోగాసనాలు, కపాలభాతి, ప్రాణాయామం, ధ్యానంతో కూడిన మార్గదర్శక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ యోగ సాధనలో అంతా చురుకుగా పాల్గొని, యోగా యొక్క శాస్త్రీయ ప్రయోజనాలపై విలువైన అవగాహన పొందారు. క్రమం తప్పని యోగా సాధన చురుకైన జీవనశైలికి, ఒత్తిడి నియంత్రణకు, వ్యాధుల నివారణకు, సంపూర్ణ శ్రేయస్సుకు ఎలా దోహదపడుతుందో శిక్షకుడు వివరించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ తో పాటు పలువురు విభాగాధిపతులు హాజరయ్యారు. వీరంతా ఆరోగ్యకరమైన, మరింత సమతుల్యమైన జీవనశైలి కోసం ఈ ప్రాచీన క్రమశిక్షణను స్వీకరించడానికి అందరితో కలిసి సాధన చేశారు.ఈ వేడుకలలో భాగంగా, పాల్గొన్న వారందరికీ టీ-షర్టులు పంపిణీ చేశారు. హాజరైన వారందరిలో ఐక్యత, శ్రేయస్సు, సామూహిక స్ఫూర్తిని పెంపొందిస్తూ, సామూహిక ఫోటో సెషన్ తో పాటు, రుచికరమైన అల్పాహారంతో ఈ కార్యక్రమం ముగిసింది.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…
ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఖాతాలో మరో అవార్డు దక్కింది .…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని బీహెచ్ఈఎల్ వాకింగ్ టీం ఆధ్వర్యంలో బిహెచ్ఇఎల్ జిల్లా…