Telangana

పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలి

సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్ చెరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పటాన్ చెరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది కార్మికులు గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని వీరంతా పేషెంట్ కేర్,హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, అటెండర్లు, ఆపరేషన్ థియేటర్లో హెల్పర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ప్రస్తుతం 11 వేల రూపాయల వేతనాలతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. హాస్పిటల్ వర్కర్లను ఏరియా హాస్పిటల్ లో శానిటేషన్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గీత ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రోజువారి పనులు నిర్వర్తించే క్రమంలో ప్రతి పనికి ఎవిడెన్స్ పేరుతో కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. ఆసుపత్రి శానిటరీ ఇన్స్పెక్టర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఒక పటాన్ చెరు ఏరియా హాస్పిటల్ లోనే ఏ విధంగా విధులు నిర్వర్తిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆమెను బదిలీ చేయాలని, హాస్పటల్లో కనీస సౌకర్యాలు కల్పించే విధంగా కార్మికులకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26వేల రూపాయలు చెల్లించే విధంగా జిల్లా అధికార యంత్రం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ సౌకర్యాలు ఉన్న ఈఎస్ఐ సౌకర్యం పూర్తిగా కార్మికులకు అందుబాటులోకి రాలేదని, కేవలం ఎంప్లాయ్ కి తప్ప వాళ్ళ కార్మికుల కుటుంబాలకు ఎక్కడ ఉపయోగపడడం లేదని అన్నారు. అందుకోసం హాస్పిటల్ కార్మికుల సమస్యల పైన దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సతీష్, స్వామి, వీరేశం, శ్రీనివాస్, రాజు, రాంబాయి, అరుణ పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago