Telangana

ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం :

యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి అన్నారు భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎమ్ ఐ జి కాలనీ శ్రీ వాణి విద్యానికేతన్ స్కూల్ సమీపంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యాయి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగకరమని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుంది” అని పేర్కొంటూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు. అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగా ఆసనాలు, శ్వాస వ్యాయామాలు చేశారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో నిర్వాహకులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ ముదిరాజ్ , మణి, తిలావత్, రాకేష్ రెడ్డి, పవన్ పాల్గొనారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago