Districts

మెటీరియల్స్ రంగంలో మనమెంతో ఎదగాలి…

– గీతం అధ్యాపక వికాస కార్యక్రమంలో వక్తల అభిభాషణ

మన వార్తలు ,పటాన్ చెరు:

ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ రంగంలో మనం ఇంకా ఎంతో వెనుకబడి ఉన్నామని , ఆ రంగంలో ఔత్సాహిక యువత చేయాల్సింది ఎంతో ఉందని గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అధ్వర్యంలో మార్చి 23-25 వరకు ‘ భౌతిక , మిశ్రమ పదార్థాల ఆధునిక పోకడల’పై నిర్వహిస్తున్న అధ్యాపక వికాస కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది . ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన ప్రోవీసీ మాట్లాడుతూ , యంత్రం రూపొందించే ఏ వ్యక్తికైనా భౌతిక పదార్థాలు చాలా ముఖ్యమైన అంశమని , వారి వద్ద నుంచి మెటీరియల్ ఉంటే తప్ప నుంచి పనిముట్టును రూపొందించలేరని వ్యాఖ్యానించారు .

ఎందుకంటే అయా మెటీరియల్ రకరకాల ఉష్ణోగ్రతలు , భారాలను తట్టుకోవాల్సి ఉంటుందన్నారు . ఈ అధ్యాపక వికాస కార్యక్రమంలో పాల్గొన్నవారిలో కొందరెనా అభివృద్ధి చెందిన దేశాలకు సమానంగా మన మెటీరియల్ రంగాన్ని తీసుకెళ్ళేలా కృషిచేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన నొక్కిచెప్పారు . ఎఫ్ఎపీలో తొలి కీలకోపన్యాసం గీతం ఇంజనీరింగ్ డీన్ విజయశేఖర్ చల్లబోయిన చేశారు . అత్మీయ అతిథి , గీతం బెంగళూరులోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరెక్టర్ ప్రొఫెసర్ దినేష్ సేథీ మాట్లాడుతూ , పరిశోధనా ఫలాలను సదస్యులకు అందించడంలో ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు . కోనిడ్ -19 నేపథ్యంలో నిర్వహించిన ఆన్లైన్ కార్యక్రమాల కంటే భౌతికంగా నిర్వహిస్తున్న ఇది ఎంతో ప్రయోజనకరమైందని ఇంజనీరింగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ నీకే మిట్టల్ అభిప్రాయపడ్డారు . తొలుత , ఈ అధ్యాపక వికాస కార్యక్రమ లక్ష్యాలను మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ తన స్వాగతోపన్యాసంలో వివరించారు .

ఈ మూడు రోజుల కార్యక్రమంలో రెండు ప్రయోగాత్మక కార్యక్రమాలతో పాటు విద్యా – పారిశ్రామి రంగాలకు చెందిన నిపుణులతో నాలుగు కీలకోపన్యాసాలు , ఐదు ఆహ్వానిత చర్చలు ఉంటాయని వందన సమర్పణలో డాక్టర్ వి.జీవన్ వెల్లడించారు . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.సీతారామయ్య , సెస్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , ప్రొఫెసర్ సి.ఈశ్వరయ్య , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు , దాదాపు 50 మంది ప్రతినిధులు పాల్గొన్నారు . గీతమ్లో ఘనంగా సంప్రదాయ వస్త్రధారణ దినోత్సవం ‘ సరంపర ‘ పేరిట ప్రతియేటా నిర్వహించే సంప్రదాయ వస్త్రధారణ దినోత్సవాన్ని ( ఎత్నిక్ డే ) బుధవారం గీతమ్ ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకలలో భాగంగా వివిధ రాష్ట్రాలు , దేశాల సంస్కృతులు , సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యా సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు . గీతం అధ్యాపకులు , సిబ్బంది కూడా విద్యార్థులను అనుసరించడంతో ప్రాంగణముంతా శోభాయమానం అయింది . ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , ప్రొఫెసర్ నీకే మిట్టల్లు ఈ వేడులను లాంఛనంగా ప్రారంభించారు . ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన రంగోలీ , ర్యాంప్ వాక్ , థోల్ , మ్యూజికల్ తంబోలా , చెవులూరించే ఆహార పదార్థాల స్టాళ్ళు అందరినీ ఆకట్టుకోవడంతో పాటు అలరించాయి .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

3 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago