Districts

అమీన్ పూర్ ప్రభుత్వ భూముల వేలం వెంటనే నిలిపివేయాలి_-బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి

మన వార్తలు ,పటాన్ చెరు:

ఆదాయ వనరుల కోసం ప్రభుత్వ భూములను అమ్మడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి  స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని 31 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని వేలం ద్వారా విక్రయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేాశారు. వెంటనే భూముల వేలాన్ని నిలిపివేయాలని లేదంటే ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఆర్ సీపురంలో శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు పత్రికా, మీడియా సమావేశం   మాట్లాడుతూఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ, అసైన్డ్‌, శిఖం, అటవీ, దేవాదాయ, భూదాన, వక్ఫ్‌, మిగులు భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం, ఉన్న భూములను కూడా అమ్మాలని నిర్ణయించడం సరికాదన్నారు.

అమీన్ పూర్ లోని 343 సర్వే నెంబర్ లోని 31 ఎకరాల భూమిని వేలం వేసేందుకు గత నెలలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ (TSIIC) ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారని గోదావరి అంజిెరెడ్డి గారు వెల్లడించారు. మార్చి 24 న ఆన్ లైన్ విధానంలో భూముల వేలం వేస్తున్నారని గజానికి 40 వేలుగా రిజర్వు ధర నిర్ణయించి.కనీసం 613 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని పొందాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆమె తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలను పట్టించుకోకుండా కేవలం ఖజానా నింపుకునేందుకు విలువైన భూములను అమ్మడాన్ని ఆమె తప్పుబట్టారు. అమీన్ పూర్ మండలంలో పోలీస్ స్టేషన్, మున్సిపాలిటీ, ప్రభుత్వ ఆస్పత్రి, తహశీల్దార్ , ఎంపీడీవో కార్యాలయం, జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలు, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు సరిపడా భూములు కేటాయించకుండా ఆదాయం కోసం భూములను ఎలా విక్రయిస్తారని గోదావరి అంజిరెడ్డి గారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

సరైన భవనాలు లేక అద్దె, ఇరుకు భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయని, వాటి నిర్మాణాలకు భూములు కేటాయించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు లేవని చెప్పే సర్కారు ఇప్పుడెలా భూములను అమ్ముతోందని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, నిరు పేదల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు 31 ఎకరాలను వెంటనే కేటాయించాలని కోరారు. ప్రభుత్వానికి ఆదాయం పైన ధ్యాస తప్ప నిరుపేదల సంక్షేమం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై లేదని విమర్శించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని అమీన్ పూర్ భూముల వేలాన్ని నిలిపివేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆమె విమర్శించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

6 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

6 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago