Districts

గీతమ్ ఘనంగా గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్…

– పాల్గొన్న విదేశీ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు

– ప్రత్యక్షంగా 27 , ఆన్లైన్ ద్వారా 17 వర్సీటీలతో ముఖాముఖి

మన వార్తలు ,పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని కెరీర్ గెడైన్స్ సెల్ ఆధ్వర్యంలో ‘ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్’ను గురువారం ఘనంగా నిర్వహించారు . ఇందులో ఆస్ట్రేలియా , కెనడా , అమెరికా , బ్రిటన్ , యూరప్ నుంచి 42 ( 27 మంతి ప్రతినిధులు స్వయంగా హాజరు కాగా , 15 వర్సిటీలు ఆన్లైన్లో ) విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి . దీనికి హాజరైన విద్యార్థులకు ఆరోగ్య భీమాపై పదివేల రూపాయల తగ్గింపు , ప్రాసెసింగ్ రుసుము – దరఖాస్తుల అసెస్మెంట్లలో సగం రాయితీ వంటి ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఆకట్టుకున్నారు . ఈ ఫెయిర్లో తక్షణ మూల్యాంకనం , అప్పటికప్పుడు ప్రవేశం వంటి సౌకర్యాలు కల్పించారు . వివిధ కోర్సులు , వాటిలో అడ్మిషన్ అవకాశాలు , ఫీజు , స్కాలర్షిప్లు , వసతి సౌకర్యం వంటి పలు సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఆయా వర్సిటీల ప్రతినిధులతో నేరుగా మాట్లాడే వెసులుబాటు కల్పించారు .

ఇంజనీరింగ్ , మేనేజ్ మెంట్ , సెన్స్ , ఫార్మసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని , విదేశాలలో వారికి తగిన అవకాశాలపై అవగాహనను పెంపొందించుకున్నారు . విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలని అభిలషించే విద్యార్థులకు ఆయా వర్సిటీలు నిర్వహిస్తున్న కోర్సులు , వారి బడ్జెట్కు అనుగుణంగా ఉందా , లేదా వంటి విషయాలన్నీ ఈ ఫెయిర్ ద్వారా విద్యార్థులు , వారి తల్లిదండ్రులు తెలుసుకోవచ్చని గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అన్నారు .

పలు కోర్సులు , వాటి రుసుములు , స్కాలర్షిప్ల గురించి సవివరంగా తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుందని ఎస్ఐజీ గ్రూపు వ్యవస్థాపకుడు వంశీ పర్వతనేని చెప్పారు . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ , ఎస్ఐజీ విదేశీ వ్యవహారాల సీఈవో ప్రీతి కోన , ఎస్ఐ సలహాదారు కేకే జెన్ , కెరీర్ గెడైన్స్ సెల్ డెరైక్టర్ ఎన్.వేణుకుమార్ తదితరులు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు

admin

Recent Posts

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

7 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

7 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

7 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

7 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

1 day ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

1 day ago