మన వార్తలు ,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘ ఫ్రెషర్స్ డే ‘ ఉత్సవాన్ని ‘ పార్టీ సెటెమోల్ ‘ పేరిట శుక్రవారం ఘనంగా నిర్వహించారు . స్నేహపూర్వక వాతావరణంలో కొత్త విద్యార్థులను స్వాగతించి , వారి విశ్వాసాన్ని చూరగొనడంతో పాటు వారిలో సృజనాత్మకతను గుర్తించి , ప్రోత్సహించే లక్ష్యంతో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు . సీనియర్లు , జూనియర్లు అనే భేదాన్ని మరిచి , తామంతా ఫార్మసీ విద్యార్థులనే అనే భావన పెంపొందించ డంతో పాటు ఐక్యంగా అంతా ఒక్కటె ఈ వేడుకలను నిర్వహించారు . కొత్త విద్యార్థులను స్వాగతించడానికి సీనియర్లు అనేక సాంస్కృతి కార్యక్రమాలను రూపొందించి , ప్రతి ఒక్కరిలో నిబిడీకృతంగా ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేశారు .
ఆయా పాటలకు తగ్గట్టు విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించడంతో పాటు ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి . మెరిసిపోతున్న దుస్తులలో విద్యార్థులు చేసిన ర్యాంప్ వాక్ ఉత్సవానికే మకుటంగా నిలిచింది . తొలుత , గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , సెన్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు జ్యోతి ప్రజ్వలన , ప్రేరణోపన్యాసాలతో ఈ ఫ్రెషర్స్ డే వేడుకలను ప్రారంభించారు . ఫార్మసీ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ తన స్వాగతోపన్యాసంలో విద్యార్థుల కృషిని అభినందించారు . పసందెన విందుతో ఈ ఒక్కరోజు వేడుకలు విజయవంతంగా ముగిశాయి .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…