Telangana

మనం దుర్బలలం, కానీ నిస్సహాయులం కాదు…

– వల్నరబిలిటీ’పై ఆతిథ్య ఉపన్యాస్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మనమందరం దుర్బలులమే, కానీ నిస్సహాయులం కాదని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని యునెస్కో చెర్జ్ ఇన్ వల్నరబిలిటీ స్టడీస్ ప్రొఫెసర్ ప్రమోద్ కె.నాయర్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎచ్ఎస్ లోని విద్యార్థులను ఉద్దేశించి సోమవారం ఆయన ‘వల్నరబిలిటీ’ అనే అంశంపె ఉపన్యసించారు. వల్నరబిలిటీ పాఠ్యాంశాలలో పరిశోధన, బోధన, కార్యశాలల నిర్వహణ వంటి పలు రంగాలలో హెదరాబాద్ కేంద్రీయ విద్యాలయంతో కలిసి జీఎసిహెచ్ఎస్ పనిచేయాలన్న నిర్ణయంలో భాగంగా, ఈ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పర్యావరణవాదం, మానవ హక్కులు, చట్టం వంటి అనేక ఇతర విభాగాలతో కూడా వల్నరబిలిటీ మమేకమ్మై ఉందని ప్రొఫెసర్ ప్రమోద్ అన్నారు. అలాగే వాతావరణ మార్పు, ప్రాంతం వంటి భిన్న రంగాలతో కూడా కలగలిసి ఉందన్నారు.

అంటువ్యాధులు, నిరోధక వెర్షన్లు లేదా ఇతర జీవసంబంధమైన విపత్తులకు మానవులు గురవుతారని, ఇవి మన శరీరాలతో పాటు మన భౌతిక వాతావరణంలోని బాహ్య శక్తులకు కూడా హాని కలిగిస్తాయని ప్రొఫెసర్ ప్రమోద్ తెలియజేశారు. అమెరికాలో 70 శాతం కాలుష్యం కలిగించే ప్రమాదకరమైన విష రసాయన వ్యర్థాలను ఆఫ్రికన్ అమెరికన్ ప్రజలు నివసించే ప్రదేశాలలో ఎక్కువగా డంప్ చేస్తారని చెప్పారు. అలాగే పలు ఐరోపా దేశాలు విచక్షణా రహితంగా రసాయన వ్యర్థాలను నదులలో పారవేయడం వలన, అవి సముద్రాలకు చేరి, చివరకు అలాస్కా వంటి మంచుతో నిండిన ప్రాంతంలోని ఎలుగుబంట్లలో వ్యాధులకు కారకాలవుతున్నాయని చెప్పారు. సోమాలియాలోని బాలలు, సూడాన్లోని మహిళల వల్నరబిలిటీని కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు.తొలుత, జీఎస్ హెచ్ఎస్ ఇన్ఛార్జి డెరైక్టర్ ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్ అతిథిని స్వాగతించి, విద్యార్థులకు పరిచయం చేశారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago