Telangana

ఆధారాలతో ఆరోపణలు చేయండి.. సమాధానం ఇచ్చేందుకు సిద్ధం

_చిల్లర రాజకీయాలు మానుకోండి

_ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ హితవు

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :

ఆధారాలతో కూడిన సహేతుక ఆరోపణలు చేస్తే సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని,
అధికార పార్టీని బదనాం చేయాలన్న కుటిల బుద్ధితో చిల్లర ఆరోపణలు చేస్తే ప్రజలు చీత్కరించుకుంటారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు.

సోమవారం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన అమీన్పూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతుంటే.. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని చూసి ఓర్వలేక అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ పరిధిలోని శంభునికుంట చెరువు పరిధిలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కబ్జాలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల విమర్శిస్తున్నాయని, ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని అన్నారు గతంలో సర్వే ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ పై వివిధ రకాల విమర్శలు రావడంతో తిరిగి సర్వే చేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించడం జరిగిందని తెలిపారు. దీంతోపాటు పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు పరిధిలోని సర్వేనెంబర్ 620లో మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి తో పాటు బలహీన వర్గాలకు చెందిన పది ఎకరాల సీలింగ్ పట్టా భూమిని ఎఫ్ టి ఎల్ లో చూపిస్తూ అప్పటి సర్వే బృందం రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. ఈ అంశంలోనూ తిరిగి సర్వే చేయాలని ప్రభుత్వానికి అప్పీలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ప్రతి రోజు ప్రతిక్షణం ప్రజల్లో తిరుగుతూ ప్రజల సంక్షేమం కోసం బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పని చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికి కోసం ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. అసైన్మెంట్ భూములను కొనుగోలు చేస్తూ క్రయ విక్రయాలు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డే జైపాల్ సైతం బిఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.ఆధారాలతో ఆరోపణలు చేస్తే సమాధానాలు ఇవ్వడానికి ఎల్లప్పుడూ తమ సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఈ సమావేశంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago