పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్ లోని మార్కెటింగ్ క్లబ్ మంగళవారం వార్షిక న్యూస్లెటర్ ‘ప్రమోషన్’ (అన్వేషించు, నేర్చుకో, ఎదుగు)ను ప్రారంభించింది. బీ-స్కూల్ అధిపతి ప్రొఫెసర్ వినయ్ కుమార్ అప్పరాజు ఈ న్యూస్లెటర్ను ఆవిష్కరించారు. ఆయనతో పాటు ప్రొఫెసర్ కరుణాకర్.బి, ప్రొఫెసర్ దేవీప్రసాద్, ప్రొఫెసర్ పినాకపాణి పేరి, డాక్టర్ నేనురాజు సుధ తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రమోషన్ కమిటీని ప్రకటించారు.ఈ వార్షిక న్యూస్లెటర్ను వెలువరించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రొఫెసర్ వినయ్ కుమార్ అభినందించారు. కొత్త బృందం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.
మార్కెటింగ్ క్లబ్ హెడ్ (2021-23 బ్యాచ్) శ్రీవాణి తమ రెండేళ్ల ప్రయాణాన్ని వివరించారు. ప్రమోషన్ నూతన అధిపతి శివాంజలి శివకుమార్ మాట్లాడుతూ, తమ ప్రాథమిక లక్ష్యం సహకారం, ఆవిష్కరణ, శ్రేష్ఠత సంస్కృ తిన పెంపొందించడమని చెప్పారు. అలాగే తమ భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన రెండు వీడియోలు (సీనియర్ల సంతోషకరమైన ప్రయాణం, న్యూస్లెటర్ ఆవిష్కరణలో జూనియర్ల కృషి) అందరి మన్ననలను చూరగొన్నాయి.ఈ కార్యక్రమంలో బీ-స్కూల్కు చెందిన పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…