పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హెదరాబాద్ లోని మార్కెటింగ్ క్లబ్ మంగళవారం వార్షిక న్యూస్లెటర్ ‘ప్రమోషన్’ (అన్వేషించు, నేర్చుకో, ఎదుగు)ను ప్రారంభించింది. బీ-స్కూల్ అధిపతి ప్రొఫెసర్ వినయ్ కుమార్ అప్పరాజు ఈ న్యూస్లెటర్ను ఆవిష్కరించారు. ఆయనతో పాటు ప్రొఫెసర్ కరుణాకర్.బి, ప్రొఫెసర్ దేవీప్రసాద్, ప్రొఫెసర్ పినాకపాణి పేరి, డాక్టర్ నేనురాజు సుధ తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రమోషన్ కమిటీని ప్రకటించారు.ఈ వార్షిక న్యూస్లెటర్ను వెలువరించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రొఫెసర్ వినయ్ కుమార్ అభినందించారు. కొత్త బృందం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.
మార్కెటింగ్ క్లబ్ హెడ్ (2021-23 బ్యాచ్) శ్రీవాణి తమ రెండేళ్ల ప్రయాణాన్ని వివరించారు. ప్రమోషన్ నూతన అధిపతి శివాంజలి శివకుమార్ మాట్లాడుతూ, తమ ప్రాథమిక లక్ష్యం సహకారం, ఆవిష్కరణ, శ్రేష్ఠత సంస్కృ తిన పెంపొందించడమని చెప్పారు. అలాగే తమ భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన రెండు వీడియోలు (సీనియర్ల సంతోషకరమైన ప్రయాణం, న్యూస్లెటర్ ఆవిష్కరణలో జూనియర్ల కృషి) అందరి మన్ననలను చూరగొన్నాయి.ఈ కార్యక్రమంలో బీ-స్కూల్కు చెందిన పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…