జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ వెయ్యండి…
– వ్యాక్సినేషన్ సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
– బిజెపి ఓబిసి మోర్చారాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్
పటాన్ చెరు:
కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తిస్తే, రాష్ట్రప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని, వ్యాక్సినేషన్ విషయంలో జర్నలిస్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ… కోరినా సెకండ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అటు ఫ్రంట్ లైన్ వారియర్స్ జర్నలిస్టులు, ఇటు ప్రజలకు సరైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. జర్నలిస్టులు తమ విధుల్లో భాగంగా రోజు ఆస్పత్రిలో ,ఇతర చోట్ల వార్తా సేకరణలో భాగంగా తిరుగుతుంటారు అలాంటి వారికి వ్యాక్సినేషన్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కరోనా కేసులు తగ్గుతున్నాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి గాంధీ ఆస్పత్రికి, కింగ్ కోటి ఆసుపత్రికి ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చి కేసులు చూస్తే తగ్గినాయా లేదా పెరిగినాయ తెలుస్తుందన్నారు. ఒకవైపు జర్నలిస్టులు మృత్యువాత పడుతుంటే, మిగతా జర్నలిస్టు భయభ్రాంతులకు గురవుతున్న రాష్ట్రప్రభుత్వం కనీసం వ్యాక్సినేషన్ వేయకపోవడం సిగ్గుచేటన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ మే ఒకటో తేదీ నుండి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించిన రాష్ట్రంలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…