జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ వెయ్యండి…
– వ్యాక్సినేషన్ సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
– బిజెపి ఓబిసి మోర్చారాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్
పటాన్ చెరు:
కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తిస్తే, రాష్ట్రప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని, వ్యాక్సినేషన్ విషయంలో జర్నలిస్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ… కోరినా సెకండ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అటు ఫ్రంట్ లైన్ వారియర్స్ జర్నలిస్టులు, ఇటు ప్రజలకు సరైన వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. జర్నలిస్టులు తమ విధుల్లో భాగంగా రోజు ఆస్పత్రిలో ,ఇతర చోట్ల వార్తా సేకరణలో భాగంగా తిరుగుతుంటారు అలాంటి వారికి వ్యాక్సినేషన్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కరోనా కేసులు తగ్గుతున్నాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి గాంధీ ఆస్పత్రికి, కింగ్ కోటి ఆసుపత్రికి ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చి కేసులు చూస్తే తగ్గినాయా లేదా పెరిగినాయ తెలుస్తుందన్నారు. ఒకవైపు జర్నలిస్టులు మృత్యువాత పడుతుంటే, మిగతా జర్నలిస్టు భయభ్రాంతులకు గురవుతున్న రాష్ట్రప్రభుత్వం కనీసం వ్యాక్సినేషన్ వేయకపోవడం సిగ్గుచేటన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ మే ఒకటో తేదీ నుండి వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించిన రాష్ట్రంలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…