Telangana

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ బుధవారం పటాన్ చెర పట్టణంలోని జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోలు ఏడుసార్లు పెంచిందని గుర్తు చేశారు 107 రూపాయలు ఉన్న పెట్రోలు 115 రూపాయలకు వెళ్లిందని, పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం వలన రోజువారి నిత్యవసర సరుకుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉన్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల వలన సామాన్య మధ్యతరగతి ప్రజానీకం పైన అధిక భారాలు పడే అవకాశం ఉంటుందని వాపోయారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచములు ధరలు భారీగా పెరగడంతో మన దేశంలో ఉన్న పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచవలసి వస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, గతంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పుడు ఎందుకు ధరలను తగ్గించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో నిత్యవసర వస్తువులతో పాటు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో రైతులు, కార్మికులు ఇతర ప్రజానికం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పవలసిన అవసరం లేదన్నారు. ధరలు పెరుగుదల కార్మికుల కుటుంబాల పైన అధిక బారాలు మోపే అవకాశం ఉందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, కార్మిక వర్గానికి వేతనాలు 26 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలు పారదర్శకంగా లేవని, అనేక పరిశ్రమల్లో 600 నుంచి 900 రూపాయలు ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 540 రూపాయలను పెంచడంలో అంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. గతంలో కార్మికులకు వస్తున్న డి ఏ ను ఎత్తివేసే చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను ఇప్పటికైనా స్పందించి వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు నల్లగండ్ల రాజు, ఆంజనేయులు, ఎం వీరేశం, ఏ కృష్ణ, జి ప్రవీణ్ కుమార్, ఎం రాజు, ఎం శ్రీశైలం, ఓబులేసు, మధుసూదన్, హరికిరణ్ లు పాల్గొన్నారు

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

6 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago