_బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్ద పీట
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో.. పటాన్చెరు, రామచంద్రాపురం బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మూడు రోజుల తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తక సభ చతుర్వేద సదస్సు, తెలంగాణ విద్వత్ పరీక్షల కార్యక్రమాన్ని శనివారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి చతుర్వేద సదస్సు, తెలంగాణ విద్వత్ పరీక్ష సభలకు పటాన్చెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్ద పీట వేయడంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలోనూ పేద బ్రాహ్మణులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి, అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని నిన్ను మనసుతో ఆశీర్వదించాలని వేద బ్రాహ్మణులను కోరారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి దంపతులు, బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…