_అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తాం
_పూర్తి పారదర్శకతతో దళారుల ప్రమేయం లేకుండా ఇళ్ల కేటాయింపు
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
దళారుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకతతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శనివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. రూపాయి ఖర్చు లేకుండా పైసా అప్పు లేకుండా అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పటాన్చెరువు నియోజకవర్గం వ్యాప్తంగా 30 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత తమపై ఉందన్నారు. విడతలవారీగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయం ఇచ్చారు. అక్టోబర్ రెండవ తేదీన లబ్ధిదారులకు ఇల్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…