_అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ లో సి ఐ టి యూ ను గెలిపించాలీ
_సిఐటియూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
కార్మికుల సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడే సిఐటియుని జరగబోయే కార్మిక సంఘం ఎన్నికల్లో సిఐటియుని గెలిపించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని అగర్వాల్ రబ్బర్ పరిశ్రమ లో వచ్చేనెల 3 న జరిగే కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలను పురస్కరించుకొని శనివారం పరిశ్రమ ముందు జరిగిన గేట్ మీటింగ్ లో మల్లేశం మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి,హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం సిఐటియూ సంఘం అని అన్నారు.రాష్ట్రంలో, జిల్లాలో అనేక పరిశ్రమల్లో కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందాలు,ఉద్యోగ భద్రత,సంక్షేమం కోసం పని చేస్తున్న సంఘం సిఐటియూ అని ఆయన అన్నారు.కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వంతో,యాజమాన్యాల తో పోరాడి కార్మికుల కు కార్మిక కుటుంబాలకు కాపాడుకునేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్మికులు ఇతరుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని వచ్చేనెల 3న జరిగే ఎన్నికల్లో చుక్క గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి సిఐటియుని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాండురంగారెడ్డి,నర్సింహ్మ రెడ్డి,రాజు, శ్రీనివాస్,రామకృష్ణ, సత్యనారాయణ వివిధ పరిశ్రమల నాయకులు,కార్మికులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…
శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…