వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు:
నియోజక వర్గంలో సూపర్ స్ప్రేడర్ల కు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో సూపర్ స్ప్రేడర్ల కు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శుక్ర, శని వారాలలో వ్యాక్సినేషన్ టీకా వేయుటకు, సమాచార పౌర సంబంధాల శాఖ పరిధిలోని జర్నలిస్టులకు, వ్యవసాయ శాఖ పరిధిలోని ఎరువులు, పెస్టిసైడ్స్,విత్తనాలు డీలర్లు హమాలీలు పౌర సరఫరాల శాఖ పరిధిలోని చౌక ధరల దుకాణాల డీలర్లు, గుమస్తాలు వర్కర్లకు,ఎల్పిజి గ్యాస్ పంపిణీ వర్కర్లకు పెట్రోల్ బంకుల్లో పనిచేసే వర్కర్లకు వ్యాక్సినేషన్ టీకాలు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ సేవలందించే వారిని ప్రభుత్వం సూపర్ స్ప్రేడర్ల లుగ గుర్తించి, వారు కరోనా బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు గుర్తించిన సూపర్ స్ప్రేడర్లలందరూ తమకు కేటాయించిన వాక్సినేషన్ కేంద్రాలలో టీకా తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వ్యాక్సినేషన్ కేంద్రాలలో భౌతిక దూరం పాటించాలని, తప్పకుండా మాస్కులు ధరించాలని, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, బల్దియా డిప్యూటీ కమిషనర్ బాలయ్య, తహసిల్దార్ మహిపాల్ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
రామచంద్రాపురం లో..
రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని కానుకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ కేంద్రాన్ని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సూపర్ స్ప్రేడర్స్ గా గుర్తించిన వాటితోపాటు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతీ నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఎమ్మార్వో శివ కుమార్, ఎస్సై కోటేశ్వర రావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…