Hyderabad

తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు దిశగా అడుగులు…

తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు దిశగా అడుగులు ..
-మంచి ఫలితాలు ఇస్తున్న లాక్ డౌన్
-తెలంగాణలో రేపటితో ముగుస్తున్న లాక్ డౌన్
-రేపు కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం

హైదరాబాద్:

లాక్ డౌన్ వల్ల మంచి ఫలితాలు ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మరో 10 నుంచి పదిహేను రోజులు పొడిగించే అవకాశముంది . ఇప్పటికే రెండు దఫాలుగా పొడిగిస్తూ వస్తున్నా ప్రభుత్వం ప్రజలనుంచి , ఫీడ్ బ్యాక్ తీసుకుంది. కఠినంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులు ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే ముఖ్యమంత్రి ,రేపు జరగబోయో మంత్రి వర్గ సమావేశంలో దీనిపై మంత్రులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు పంపిన మార్గదర్శనాలలో జూన్ నెలాఖరువరకు లాక్ డౌన్ పొదిగితే బాగుంటుందనే సూచన చేశాయి.

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన ఈసారి కొంత కఠినంగానే లాక్ డౌన్ అమలు జరిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. రేపటితో రాష్ట్రంలో లాక్ డౌన్ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతోంది. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం… లాక్ డౌన్ ను మరి కొన్ని రోజుల పాటు కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఘననీయంగా తగ్గింది.ప్రజల్లో కొంత మేరకు అవగాహనా కలిగింది. అయితే వ్యాక్సిన్ అనుకున్నంత వేగంగా జరగటంలేదు. వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వ యంత్రంగాం సిద్ధంగా ఉన్న వ్యాక్సిన్ సరఫరా అందుకు అనుగుణంగా లేదు . చివరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొనిగొలు చేసేందుకు సిద్ధపడిన ఫార్మా కంపెనీ లు సరఫరా చేయలేక పోతున్నాయి. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మల్ల గుల్లాలు పడుతున్నాయి. అందువల్ల రేపటి కేబినెట్ సమావేశంలో… ప్రస్తుత లాక్ డౌన్ ఎలాంటి ఫలితాలను ఇచ్చిందనే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితి ఎలా ఉంది? అనే విషయంపై ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కేసీఆర్ ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగిస్తేనే మేలనే అభిప్రాయాన్ని వీరిలో ఎక్కువ మంది వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నారు.

Venu

Recent Posts

హైలైఫ్ జూవెల్స్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రింన సినీన‌టి కామాక్షి భాస్క‌ర్ల

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోని ప్ర‌ముఖ జ్యూవెల‌రీ సంస్థలు వినియోగ‌దారుల కోసం ఒకే వేదిక‌పై బంగారం, వజ్రాలు, ప్లాటినం,…

2 hours ago

భవన నిర్మాణ రంగంలో ఇన్సూరెన్స్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల దుర్వినియోగం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భవన నిర్మాణ రంగంలో ఇన్సూరెన్స్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నట్లు సిఐటియు…

9 hours ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యజమాన్యం పై చర్యలు తీసుకోని కార్మిక శాఖ సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

బిస్లరి పరిశ్రమ కార్మికులు చెట్ల కొమ్మలు కట్టుకొని వినూత్నం నిరసన అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి ఈనెల 25న…

9 hours ago

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి.పాండురంగా రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, నిర్వహణలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా…

9 hours ago

గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారులను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: కరాటే పోటీలలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారులను పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం…

9 hours ago

ఆగస్టు 19న పటాన్‌చెరు యాదవ సంఘం ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన యాదవ…

17 hours ago