మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
బిస్లరి వర్షములో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలని కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న బిస్లరి యాజమాన్యంపై కార్మిక శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు అతిమేల మానిక్ తీవ్రంగా ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం బిస్లరీ చేస్తున్న సమ్మె 40వ రోజుకు చేరుకుంది. సోమవారం బిస్లరీ యాజమాన్యం మొండి వైఖరి ఆటవిక చర్యలతో కార్మికులు రోడ్నపడాని నిరసిస్తూ చెట్ల కొమ్మలు కట్టుకొని వినూత్నంగా ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా అతిమేల మానిక్ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా కార్మికులు పరిశ్రమ అభివృద్ధి కోసం శ్రమించారన్నారు. ఒక్క ప్లాంట్ ద్వారా ఎన్నో ప్లాంట్లను ఏర్పాటు చేసి యజమాన్యం వేల కోట్లు గడుస్తుందని విమర్శించారు. కార్మికులు హక్కులు ఉద్యోగ భద్రత కోసం చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసుకుంటే యాజమాన్యం కక్ష సాధింపులతో ఐదు మంది యూనియన్ నాయకత్వాన్ని అక్రమంగా తొలగించిందని, తొలగించి 9 నెలలైనాన యాజమాన్యం మొండిగా వ్యవరిస్తుందని ఆరోపించారు. గత 40రోజులు కార్మికులు సమ్మె చేస్తున్నారని అన్నారు. చట్టాలు విల్లంగిస్తున్న యాజమాన్యంపై కార్మిక శాఖ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని మంది పడ్డారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులోకి తీసుకోవాలని వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు జులై 25వ తేదీన చలో బిస్లరీ (ఐడిఏ పాశమైలారం) కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొంటారన్నారు..ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు, యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి, నాయకులు నాగరాజు, నవీన్, అజయ్, ప్రవీణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
L
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…